NTR -Chiranjeevi: సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది.రాజకీయాలలో కొనసాగిన వారు సినిమాలలోకి రావడం సినిమాలలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు రాజకీయాలలోకి వెళ్లడం సర్వసాధారణంగా జరిగే అంశం. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులుగా గుర్తింపు సంపాదించుకొని రాజకీయ నాయకులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్ జయలలిత వంటి వారు ఒకరు.
ఈ నటీనటులను ఆదర్శంగా తీసుకొని కమల్ హాసన్ చిరంజీవి వంటి తదితరులు కూడా రాజకీయాలలోకి వచ్చారు.ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు 58 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఇక ఎన్టీఆర్ స్ఫూర్తిగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఈయనకు పెద్దగా రాజకీయాలు కలిసి రాకపోవడంతో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి కన్నా ముందుగా మరొక టాలీవుడ్ హీరో సొంతంగా రాజకీయ పార్టీని పెట్టారు. అయితే ఈ రాజకీయ పార్టీ గురించి చాలామందికి తెలియదు. ఇలా ఎన్టీఆర్ తర్వాత సొంత రాజకీయ పార్టీ పెట్టిన హీరో మరెవరో కాదు నందమూరి తారక రామారావు కుమారుడు, నటుడు హరికృష్ణ. ఈయన తన తండ్రి తర్వాత సొంత రాజకీయ పార్టీని పెట్టారు.
హరికృష్ణ 1999లో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు.ఇలా సొంత పార్టీని స్థాపించిన ఈయన గంట గుర్తుతో 1999 సార్వత్రిక ఎన్నికలలో పోటీకి దిగారు. అయితే ఈయన పార్టీ ఏ విధమైనటువంటి ప్రభావం చూపకపోవడంతో హరికృష్ణ తిరిగి టిడిపి పార్టీలో క్రియాశీలకంగా మారి పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున ఈయన రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. అయితే ఈయన పెట్టిన అన్న తెలుగుదేశం పార్టీ గురించి చాలామందికి తెలియదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…