NTR: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు వారి సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఇలా పలువురు హీరోల సినిమాలలో చాలామంది కొన్ని హిట్ సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు అయితే ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి ఒక హిట్ సెంటిమెంట్ ఉందని తెలుస్తుంది.ఇండస్ట్రీలో డిజాస్టర్ దర్శకులుగా పేరు సంపాదించుకున్న వారి తదుపరి సినిమాలో కనుక ఎన్టీఆర్ నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.
ఇప్పటికే ఎన్టీఆర్ ఈ విధంగా ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లకు సినిమా అవకాశాలను ఇచ్చి ఐదు సార్లు బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం కొరటాల శివ కూడా ఆచార్య సినిమాతో డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు పొందారు దీంతో ఈయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అభిమానులు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లు ఎవరు అనే విషయానికి వస్తే…
వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బృందావనం సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సుకుమార్ మహేష్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా అవకాశం కల్పించి హిట్ కొట్టారు. ఇక వరుస ఫ్లాప్ సినిమాలతో ఎంతో ఇబ్బందులలో ఉన్నటువంటి పూరికి టెంపర్ అవకాశమిచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు.
అజ్ఞాతవాసి వంటి సినిమా ద్వారా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా ద్వారా హిట్ కొట్టారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు డైరెక్షన్ చేసి డిజాస్టర్ అందుకున్నటువంటి డైరెక్టర్ బాబీకి జై లవకుశ సినిమా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ క్రమంలోనే ఆచార్య డిజాస్టర్ తో బాధపడుతున్నటువంటి కొరటాలకు దేవర అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా హిట్టేనని మరోసారి హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…