NTR: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలలో కూడా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇకపోతే గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాలలోకి రావాలని ఈయన తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెడితేనే పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని అభిమానులు భావించి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ను రాజకీయాలలోకి రావాలని కోరారు.
ఇలా ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని అభిమానులు ఎంత కోరుకున్న ఈయన మాత్రం రాజకీయాల గురించి ఏ మాత్రం నోరు విప్పలేదు.అయితే ఎవరు ఊహించని విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఏకంగా ఎన్టీఆర్ కి అపాయింట్మెంట్ ఇచ్చి ఎన్టీఆర్ తో భేటీ కావడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు దారి తీసింది. ఈ విధంగా ఎన్టీఆర్ అమిత్ షా భేటీ వెనుక ఉన్న కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.
ఒకవేళ అమిత్ షా ఎన్టీఆర్ ను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారా అనే విషయం తెలియడంతో అభిమానులు ఈ విషయంపై స్పందించి పొరపాటున కూడా అలాంటి తప్పు చేయవద్దని అభిమానులు తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ కి సూచనలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కనుక బీజేపీ పార్టీలోకి వెళితే ఈయన వ్యక్తిగతంగా ఇతర పార్టీ నాయకులకు టార్గెట్ అవుతారు. తద్వారా ఈయనకు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే పొరపాటున కూడా రాజకీయాలలోకి వద్దంటూ అభిమానులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఈయన డిమాండ్ చేస్తే ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు ఉన్నారని ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైతే బాగుంటుందని రాజకీయాలలోకి వెళ్తే మాత్రం ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అభిమానులు ఈయన రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ రాజకీయాలలోకి మాత్రం వద్దని సూచనలు చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ అమిత్ షా భేటీ వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…