NTR-Star Hero: ఎన్టీఆర్ తదుపరి చిత్రం.. కీలక పాత్రలో స్టార్ హీరో..! డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
NTR-Star Hero: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెంచాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ వల్ల దాదాపుగా మూడేళ్లలో ఏ ఒక్క సినిమాకు కూడా కమిట్ కాలేదు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ షూటింగ్ ముగియడంతో ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ లకు కమిట్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూసిన ట్రిపుల్ ఆర్ జనవరి 7న ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడటం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురంభీంగా ఎన్టీఆర్ నటిస్తుండంతో పాటు బాలీవుడ్ స్టార్లు అలియాభట్, అజయ్ దేవ్ గన్ కూడా నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
సినిమా విడుదల ముందు భారీగానే ప్రమోషన్లు చేసిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా విడుదలను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు తెలిసింది. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ‘ జనతా గ్యారేజీ ’ బ్లాక్ బస్టర్ ఉంది. దీంతో సహజంగానే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ హైప్ ను మరింత పెంచే వార్త ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఎన్టీఆర్ బాబాయ్ పాత్రను స్టార్ హీరో రాజశేఖర్ పోషిస్తున్నట్లు తెలిసింది. ఇదే నిజం అయితే ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, అటు రాజశేఖర్ ఫ్యాన్స్ కు పండగే. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజశేఖర్.. “శేఖర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు రాజశేఖర్ చేతిలో ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…