బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోతున్న కార్యక్రమం “ఎవరు మీలో కోటీశ్వరుడు”. బుల్లితెరపై ఇదివరకే “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో కొన్ని సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా “ఎవరు మీలో కోటీశ్వరుడు” గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసారి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా యంగ్ టైగర్ వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు పెద్దఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని ఈ కార్యక్రమంపై అంచనాలు పెంచాయి.
గత కొద్ది రోజుల నుంచి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ కు
సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలు ఇద్దరు స్టార్ హీరోలు అయినటువంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఎంట్రీ ఇవ్వడం ప్రోమోకి హైలెట్ అయిందని చెప్పవచ్చు.
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ఒకే వేదికపై కనిపించడంతో ఈ కార్యక్రమం దద్దరిల్లిపోతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ ప్రోమో రికార్డు స్థాయిలో రేటింగ్ సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. ఈ ప్రోమోలో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య జరిగే సంభాషణ ఎంతో ఆసక్తి కరంగా మారింది. ఈ ప్రోమోలో భాగంగా ఏది హాట్ సీట్, ఏది హోస్ట్ సీట్ తారక్ చెర్రీకి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు చెర్రీ దీర్ఘంగా ఆలోచిస్తూ సమాధానాలను తెలియజేస్తున్నారు.
ఈ విధంగా వీరిద్దరి మధ్య సాగిన మొదటి ఎపిసోడ్ ఆగస్టు 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసే సందడి తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెంగుళూరులో బాలికపై జరిగిన అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఇంటి బయట ఆడుకుంటున్న 11 ఏళ్ల చిన్నారిని…
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన రాజశేఖర్ తన కెరీర్లో కొత్త దశను ఆత్మవిశ్వాసంతో ముందుకు…
గ్రహాల సంచారం మనిషి జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ముఖ్యంగా ప్రేమ, వివాహం, సౌఖ్యం వంటి అంశాలకు…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా పేరొందిన నయనతార – విఘ్నేష్ శివన్ తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంను…
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, విస్తీర్ణం పరంగా అగ్రగామిగా నిలిచిన క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. ‘భూలోక వైకుంఠం’గా…
మన రోజువారీ సంభాషణల్లో “పెద్ద కళ్లు”, “చిన్న కళ్లు” అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. రూపురేఖల పరంగా ఇది ఒక…