NTR: అమెరికాలో ఆస్కార్ అవార్డువేడుక ముగిసిన తర్వాత చిత్ర బృందం మొత్తం తిరిగి హైదరాబాద్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుక తర్వాత మొదటిసారి విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ వేదికపై మాట్లాడుతూ ఆస్కార్ గురించి మొదటిసారి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ నాటు నాటు పాట నేడు ఆస్కార్ అవార్డు అందుకుంది అంటే అందుకు రాజమౌళి ప్రేమ్ రక్షిత్ చంద్రబోస్ కీరవాణి కాలభైరవ వంటి ఇతరులు ఎంతవరకు కారకులో అంతకుమించి తెలుగు, భారతీయ చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు కూడా కారణమని తెలిపారు.
వీటన్నింటితో పాటు మీరు మాపై చూపించే ప్రేమ అభిమానం కూడా కారణమని ఎన్టీఆర్ తెలిపారు. ఇక కీరవాణి చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డు తీసుకుంటూ ఉంటే నాకు వాళ్ళు కనిపించలేదు ఇద్దరు భారతీయులు ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు. ఈ వేడుకను మీరు టీవీల్లో చూసి ఎంత ఆనందపడ్డారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆ క్షణం ఎంతో సంతోషంతో, గర్వంతో ఉప్పొంగి పోయానని తెలిపారు.
ఇలాంటి క్షణం మరి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ రావాలని కచ్చితంగా కోరుకుందాం. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో భారతీయ,తెలుగు సినిమా పరిశ్రమలు మరికొన్ని ఆస్కార్ అవార్డులను కూడా అందుకోవాలని మనసారా భగవంతుడిని ప్రార్థిద్దాం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలు గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…