NTR: అమెరికాలో ఆస్కార్ అవార్డువేడుక ముగిసిన తర్వాత చిత్ర బృందం మొత్తం తిరిగి హైదరాబాద్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుక తర్వాత మొదటిసారి విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ వేదికపై మాట్లాడుతూ ఆస్కార్ గురించి మొదటిసారి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ నాటు నాటు పాట నేడు ఆస్కార్ అవార్డు అందుకుంది అంటే అందుకు రాజమౌళి ప్రేమ్ రక్షిత్ చంద్రబోస్ కీరవాణి కాలభైరవ వంటి ఇతరులు ఎంతవరకు కారకులో అంతకుమించి తెలుగు, భారతీయ చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు కూడా కారణమని తెలిపారు.
వీటన్నింటితో పాటు మీరు మాపై చూపించే ప్రేమ అభిమానం కూడా కారణమని ఎన్టీఆర్ తెలిపారు. ఇక కీరవాణి చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డు తీసుకుంటూ ఉంటే నాకు వాళ్ళు కనిపించలేదు ఇద్దరు భారతీయులు ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు. ఈ వేడుకను మీరు టీవీల్లో చూసి ఎంత ఆనందపడ్డారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆ క్షణం ఎంతో సంతోషంతో, గర్వంతో ఉప్పొంగి పోయానని తెలిపారు.
ఇలాంటి క్షణం మరి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ రావాలని కచ్చితంగా కోరుకుందాం. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో భారతీయ,తెలుగు సినిమా పరిశ్రమలు మరికొన్ని ఆస్కార్ అవార్డులను కూడా అందుకోవాలని మనసారా భగవంతుడిని ప్రార్థిద్దాం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలు గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…