NTR: అమెరికాలో ఆస్కార్ అవార్డువేడుక ముగిసిన తర్వాత చిత్ర బృందం మొత్తం తిరిగి హైదరాబాద్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుక తర్వాత మొదటిసారి విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ వేదికపై మాట్లాడుతూ ఆస్కార్ గురించి మొదటిసారి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ నాటు నాటు పాట నేడు ఆస్కార్ అవార్డు అందుకుంది అంటే అందుకు రాజమౌళి ప్రేమ్ రక్షిత్ చంద్రబోస్ కీరవాణి కాలభైరవ వంటి ఇతరులు ఎంతవరకు కారకులో అంతకుమించి తెలుగు, భారతీయ చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు కూడా కారణమని తెలిపారు.
వీటన్నింటితో పాటు మీరు మాపై చూపించే ప్రేమ అభిమానం కూడా కారణమని ఎన్టీఆర్ తెలిపారు. ఇక కీరవాణి చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డు తీసుకుంటూ ఉంటే నాకు వాళ్ళు కనిపించలేదు ఇద్దరు భారతీయులు ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు. ఈ వేడుకను మీరు టీవీల్లో చూసి ఎంత ఆనందపడ్డారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆ క్షణం ఎంతో సంతోషంతో, గర్వంతో ఉప్పొంగి పోయానని తెలిపారు.
ఇలాంటి క్షణం మరి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ రావాలని కచ్చితంగా కోరుకుందాం. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో భారతీయ,తెలుగు సినిమా పరిశ్రమలు మరికొన్ని ఆస్కార్ అవార్డులను కూడా అందుకోవాలని మనసారా భగవంతుడిని ప్రార్థిద్దాం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలు గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…