తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది అద్భుతమైన నటనను కనబరిచేవారు. ఈ విధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినటువంటి రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్ వీరందరూ ఒకప్పుడు ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో గొప్ప మంచి పేరును సంపాదించుకున్నారు. వీరందరూ స్టార్ సెలబ్రిటీగా ఉన్న సమయంలో కోట శ్రీనివాసరావు అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సమయంలోనే వీరందరికీ కూడా ఎంతో సరదాగా సెట్లో గడిపేవారు.
ఈ క్రమంలోనే కోట శ్రీనివాస్ రావు నూతన్ ప్రసాద్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. అప్పట్లో ఎన్టీఆర్ పై వ్యతిరేకంగా కోట శ్రీనివాసరావు మండలాధీశుడు అనే చిత్రంలో నటించారు. అదేవిధంగా కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ పాత్రలో నూతన్ ప్రసాద్ చంద్రబాబు నాయుడు పాత్రలో నా పిలుపే ప్రభంజనం అనే సినిమాలో చేశారు.అయితే అందులో చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన నూతన్ ప్రసాద్ ఆ తర్వాత ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని తెగ భయపడేవారని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేశారు.
అలాగే నూతన ప్రసాద్ అన్ని పాత్రలలోనూ చెయ్యలేరని, కేవలం కొన్ని పాత్రలకు మాత్రమే అతడు బాగా సెట్ అవుతాడని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఈవీవీ సత్యనారాయణ గారు తన దగ్గరకు వచ్చి మీరు అన్ని పాత్రలలో ఇట్టే ఇమిడి పోతారు. అది ఎలా సాధ్యం అంటూ తనని అడిగినట్లు కోట శ్రీనివాస్ రావు చెప్పారు. అసలు ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, అంతా ఆ భగవంతుడు దయఅని, గుమ్మడి కాయంత తెలివి మాత్రమే కాదు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాస్ రావు అని అప్పట్లో చాలామంది తన గురించి మాట్లాడేవారని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేశారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…