ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బంగారంకు ఉండే డిమాండ్ అంతాఇంతా కాదు. పండగల సమయంలో, పెళ్లిళ్ల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. బంగారం కొనుగోలు చేస్తే మనకు అవసరమైన సమయంలో బంగారాన్ని తనఖా పెట్టి రుణం పొందే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు గోల్డ్ లోన్లపై ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుంటే మరికొన్ని బ్యాంకు మాత్రం తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి.
ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే బంగారాన్ని తనఖా పెట్టి సులభంగా రుణం పొందవచ్చు. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం బంగారానికి తక్షణమే రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అయితే గోల్డ్ లోన్ తీసుకునే ముందు మొదట బ్యాంకుల వడ్డీరేట్లను పరిశీలించాలి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.5 శాతం నుంచి బంగారు ఆభరణాలపై రుణాలను మంజూరు చేస్తోంది.
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం 7 శాతం వడ్డీకే రుణాలను అందిస్తోంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం రుణాలను 7.35 శాతం వడ్డీకి అందిస్తోంది. అయితే గోల్డ్ లోన్ తీసుకోవాలంటే బ్యాంకుల ద్వారా తీసుకోవడమే ఉత్తమం. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.
ఐఐఎఫ్ఎల్ లో బంగారం రుణాలపై వడ్డీ రేటు 9.24 శాతంగా ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ 11 శాతం వడ్డీరేటుకు రుణాలను అందిస్తోంది. మణపురం ఫైనాన్స్ లో 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తుండగా ముత్తూట్ ఫైనాన్స్లో 11.9 శాతం వడ్డీ పడుతోంది. తాత్కాలికంగా రుణాలు కావాలంటే గోల్డ్ ఫైనాన్స్ లను, దీర్ఘకాలికంగా కావాలంటే బ్యాంకులను సంప్రదించడం మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…