భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి మహిళలకు భద్రత లేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.ఇకపోతే ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం బతికితే చాలు అని ఎంతోమంది భావిస్తున్న నేపథ్యంలో కూడా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు.సాధారణ మనుషుల విషయం పక్కనపెడితే ఏకంగా కరోనా బారినపడి, కరోనా చికిత్స తీసుకుంటున్న మహిళల పట్ల కూడా ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరగడం చూస్తుంటే మన దేశంలో మహిళలకు భద్రత ఎంత ఉందో తెలిసిపోతుంది.
ఒడిశాలోని న్యూపాద జిల్లా. అది ఏప్రిల్ 26. ఆస్పత్రిలో కరోనాతో బాధపడుతున్న బాధితులు అందరూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ మహిళ కరోనా బారిన పడి ఆస్పత్రికి వచ్చింది. మిగతా పేషెంట్లు అందరూ యువతి పట్ల దీనంగా చూడగా రెండు కళ్ళు మాత్రం ఆమెను వక్రబుద్ధితో చూశాయి. అదే సమయంలోనే ఆ బాధితురాలు ఏదో పని నిమిత్తం ఒక గదిలోకి వెళ్ళగానే వెంటనే కరోనాతో బాధపడుతున్న మరొక మానవ మృగం ఆ గదిలోకి వెళ్ళాడు.
కొద్దిసేపటికి ఆ గదిలో నుంచి గట్టిగా కేకలు వినిపించడంతో మిగిలిన వారందరు వెళ్లి చూడగా లోపలినుంచి ఆ మహిళ కన్నీటితో బయటకు వచ్చి అసలు విషయం బయట పెట్టింది. దీంతో వళ్ళు మండిన సదరు పేషెంట్లు అతనిని చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఓ లేడీ తహసిల్దార్ ఆమె దగ్గర స్టేట్మెంట్ తీసుకొని తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలపగా కేసు నమోదు చేసుకున్నారు.
న్యూపాద పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంజుక్త బర్లా… అతనిపై IPC సెక్షన్ 354 (మహిళపై బలవంతపు దాడి), సెక్షన్ 354 (A), సెక్షన్ 269, సెక్షన్ 270 కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు.అతనికి ప్రస్తుతం కరుణ పాజిటివ్ గా ఉండటం తో అతనికి నెగిటివ్ వచ్చిన తర్వాత రిమాండ్ కి తరలిస్తామని, ప్రస్తుతం అతనిని ఆ ఆస్పత్రి నుంచి పాలిటెక్నిక్ ట్యూన్డ్ కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…