ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. మోసాలపై అవగాహన లేనివాళ్లతో పాటు అవగాహన ఉన్నవాళ్లను సైతం కొందరు తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని హెబ్బాళ గోపనహళ్లి పోస్ట్ ఆఫీస్ లో పార్శిల్ తీసుకుని డబ్బులు చెల్లించిన ఒక వ్యక్తి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. తనలా మరొకరు మోసపోవద్దంటూ కోరుతున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లికి చెందిన నరసింహామూర్తి చాలా రోజుల నుంచి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నాడు. అతను ఆన్ లైన్ లో సెర్చ్ చేసే సమయంలో తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ విక్రయిస్తున్నట్టు ప్రకటన కనిపించింది. స్మార్ట్ ఫోన్ ధర కేవలం 1700 రూపాయలు కావడంతో నరసింహమూర్తి ఆనందంతో స్మార్ట్ ఫోన్ ను ఆర్డర్ చేశాడు.
కొందరు వ్యక్తులు నరసింహమూర్తికి ఫోన్ చేసి ఫోన్ ను పోస్టాఫీస్ ద్వారా తీసుకోవాలని సూచించగా వాళ్లు చెప్పిన విధంగా నరసింహమూర్తి హెబ్బాళ నుంచి గోపనహళ్లి పోస్టాఫీస్ కు వెళ్లి పార్శిల్ ఓపెన్ చేసి చూశాడు. పార్శిల్ లో ఫోన్ కు బదులుగా సోన్ పాపిడి మిఠాయిలు, రోల్డ్ గోల్డ్ చైన్ ఉండటంతో షాక్ కావడం నరసింహమూర్తి వంతయింది. నరసింహమూర్తి పోలీసులకు ఆన్ లైన్ మోసం గురించి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.
ఎవరైనా ఆన్ లైన్ లో వస్తువులను కొనుగోలు చేయాలని భావిస్తే ప్రముఖ ఈకామర్స్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తే మంచిది. లేదంటే డూప్లికేట్ ఉత్పత్తులు రావడం, డబ్బులు మోసపోవడం జరిగే అవకాశం ఉంటుంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…