Featured

మహిళలకు ప్రవేశం లేని ఆలయమిదే.. దేవునికి మగవాళ్ల పొంగళ్లు..?

సాధారణంగా ఏ ఆలయానికైనా స్త్రీ పురుషులు వెళ్లే అవకాశం ఉంటుంది. సంక్రాంతి పండగ సమయంలో ఏ ఆలయంలోనైనా ఆడవాళ్లు పొంగళ్లు పెడతారు. అయితే ఒక ఆలయంలో మాత్రం మగవాళ్లే పొంగళ్లు పెడతారు. కడప జిల్లాలోని పుల్లంపేటలో ఉన్న తిప్పాయపల్లె సంజీవరాయ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం రోజున ఆలయాల్లో మగవాళ్లు పొంగళ్లు పెడతారు.ఈ ఆలయంలో మగవాళ్లే ప్రసాదం చేయడంతో పాటు ఆ ప్రసాదాన్ని కూడా కేవలం మగవాళ్లు మాత్రమే తింటారు. మహిళలు ఆలయంలోకి రాకుండా ఆలయం బయటినుంచే స్వామిని దర్శించుకుని వెళ్లిపోతారు. సంక్రాంతి ముందు ఆదివారం రోజున ఈ విధంగా సంవత్సరాల తరబడి ఆచారం కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నా పండుగ ముందు ఆదివారం రోజు గ్రామానికి చేరుకుని ఉద్యోగులు, వ్యాపారులు పొంగళ్లు వండుతారు.

రాతిశిలపై ఉన్న లిపినే ఇక్కడి గ్రామస్తులు సంజీవరాయుడిగా కొలుస్తారు. పొంగలి చేయడానికి కావాల్సిన సామాగ్రిని తెచ్చుకుని సంజీవరాయుని దగ్గర పొంగళ్లను పెట్టుకుంటారు. తిప్పాయపల్లె గ్రామంలో చాలా సంవత్సరాల క్రితం పంటలు పండేవి కావు. గ్రామ ప్రజలు కరువు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఒక బ్రాహ్మణుడు రాయిపై లిపితో రాసి సంజీవరాయుని విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

ఆ విగ్రహాన్ని ప్రతిష్టించిన అనంతరం గ్రామంలో పొంగళ్ల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు. విగ్రహం ప్రతిష్టించినప్పటి గ్రామం సుభిక్షంగా ఉండటంతో పాటు పంటలు బాగా పండుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దేవునికి గ్రామస్తులు కొబ్బరి, బెల్లం కానుకలుగా సమర్పిస్తారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago