Connect with us

devotional

మహిళలకు ప్రవేశం లేని ఆలయమిదే.. దేవునికి మగవాళ్ల పొంగళ్లు..?

Published

on

సాధారణంగా ఏ ఆలయానికైనా స్త్రీ పురుషులు వెళ్లే అవకాశం ఉంటుంది. సంక్రాంతి పండగ సమయంలో ఏ ఆలయంలోనైనా ఆడవాళ్లు పొంగళ్లు పెడతారు. అయితే ఒక ఆలయంలో మాత్రం మగవాళ్లే పొంగళ్లు పెడతారు. కడప జిల్లాలోని పుల్లంపేటలో ఉన్న తిప్పాయపల్లె సంజీవరాయ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం రోజున ఆలయాల్లో మగవాళ్లు పొంగళ్లు పెడతారు.ఈ ఆలయంలో మగవాళ్లే ప్రసాదం చేయడంతో పాటు ఆ ప్రసాదాన్ని కూడా కేవలం మగవాళ్లు మాత్రమే తింటారు. మహిళలు ఆలయంలోకి రాకుండా ఆలయం బయటినుంచే స్వామిని దర్శించుకుని వెళ్లిపోతారు. సంక్రాంతి ముందు ఆదివారం రోజున ఈ విధంగా సంవత్సరాల తరబడి ఆచారం కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నా పండుగ ముందు ఆదివారం రోజు గ్రామానికి చేరుకుని ఉద్యోగులు, వ్యాపారులు పొంగళ్లు వండుతారు.

రాతిశిలపై ఉన్న లిపినే ఇక్కడి గ్రామస్తులు సంజీవరాయుడిగా కొలుస్తారు. పొంగలి చేయడానికి కావాల్సిన సామాగ్రిని తెచ్చుకుని సంజీవరాయుని దగ్గర పొంగళ్లను పెట్టుకుంటారు. తిప్పాయపల్లె గ్రామంలో చాలా సంవత్సరాల క్రితం పంటలు పండేవి కావు. గ్రామ ప్రజలు కరువు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఒక బ్రాహ్మణుడు రాయిపై లిపితో రాసి సంజీవరాయుని విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

ఆ విగ్రహాన్ని ప్రతిష్టించిన అనంతరం గ్రామంలో పొంగళ్ల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు. విగ్రహం ప్రతిష్టించినప్పటి గ్రామం సుభిక్షంగా ఉండటంతో పాటు పంటలు బాగా పండుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దేవునికి గ్రామస్తులు కొబ్బరి, బెల్లం కానుకలుగా సమర్పిస్తారు.

Advertisement

devotional

Mahesh Babu: మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. నమ్రత కూడా కాదంట తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మహేష్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఈ క్రమంలోనే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఈ హీరోయిన్లతో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ మళ్లీ మళ్లీ హీరోయిన్లతో షేర్ చేసుకోవాల్సి వస్తే షేర్ చేసుకుంటానని తెలిపారు. త్రిషతో నటించడం చాలా సులభంగా ఉంటుందని అంతేకాకుండా తనతో నా స్క్రీన్ స్పేస్ బాగుంటుందని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య సీన్స్ అద్భుతంగా ఉండడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అని ఈయన తెలిపారు.

Advertisement

ఫ్రెండ్షిప్ కారణం…
ఇక త్రిష తర్వాత సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఇష్టపడతానని తెలిపారు. అయితే ఈయన భార్య నమ్రత కూడా హీరోయినే, ఈమెతో కలిసి కూడా మహేష్ బాబు సినిమాలలో నటించారు కానీ ఈయన మాత్రం తన భార్య పేరు చెప్పకుండా త్రిష సమంత అంటూ తనకి ఇష్టమైనటువంటి హీరోయిన్లు మళ్లీమళ్లీ సినిమాలలో నటించాలనుకునే హీరోయిన్ల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

devotional

Donates: ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు కనుక ఇచ్చారో అప్పలపాలు అయినట్టే?

Published

on

Donates: సాధారణంగా మనం ఏదైనా పండుగల సమయంలోను లేదా ఎప్పుడైనా ఇతరులకు దానధర్మాలను చేస్తూ ఉంటాము. ఇలా ఇతరులకు మనం చేసే దానధర్మాల వల్ల వారు సంతోషించినప్పుడే మనం చేసిన దాన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అందుకే పెద్ద ఎత్తున మన ఆర్థిక స్థోమతకు అనుకూలంగా దాన ధర్మాలను చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం మన ఇంటికి వచ్చిన వారికి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యానికి బదులు పాపం కలుగుతుంది.

ఇంటికి వచ్చినటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా చిరిగిపోయిన బట్టలను అలాగే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను లేదా లోహపు వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు. ఇలా ఈ వస్తువులు కనుక ఇచ్చాము అంటే దానం చేసిన పుణ్యఫలం ఏమో కానీ పెద్ద ఎత్తున పాపం రావడమే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది.

పుణ్యం కలుగుతుంది..

Advertisement

అందుకే పొరపాటున కూడా ఇలాంటి వస్తువులను పేదవారికి గాని ఇతరులకు కానీ దానం చేయకూడదు ముఖ్యంగా కొబ్బరి నూనెను కూడా మనం ఇతరులకు ఎప్పుడు దానం చేయకూడదు. మనం ఇతరులకు పెట్టే ఆహార పదార్థమైన ఇచ్చే దుస్తులు వల్ల అయినా కూడా వారు సంతోషంగా ఉన్నప్పుడే ఆ దానం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Advertisement
Continue Reading

devotional

Lakshmi Devi: ఇలాంటి సంకేతాలు మీకు కనబడుతున్నాయా… మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే?

Published

on

Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఎన్నో రకాల పూజలు వ్రతాలు హోమాలు చేస్తూ ఉంటారు. మనం కష్టపడి సంపాదించిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంది అంటే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సంకేతాలు కనుక మనకి ఎదురవుతూ ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నట్టే.

మన ఇంటి ఆవరణంలో కోకిల తరచూ కూస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం అయితే ఉదయం సమయంలో ఆగ్నేయ మూలలో కోయిల కూస్తూ ఉంటే అది అశుభానికి సంకేతం కానీ సంధ్య సమయంలో ఆగ్నేయ దిశగా కోయిల కూస్తూ ఉంటే మంచిది. అలాగే మామిడి చెట్టుపై కోయిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని అర్థం.

ఇకపోతే నల్ల చీమలు ఇంట్లో కనపడితే అది లక్ష్మీదేవి రాకను చూచిస్తుంది ముఖ్యంగా చీమలు బియ్యాన్ని కనుక తీసుకు వెళుతూ ఉన్నట్టయితే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అర్థం. ఇక బల్లి కూడా మనపై అనుకోకుండా పడితే అది కూడా అదృష్టమని కానీ కుడి వైపు బల్లి పడటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది.

Advertisement

నల్ల చీమలు సంపదకు సూచిక…

ఇంట్లో కనుక నల్ల చీమలకు బదులు ఎర్రటి చీమలు కనపడితే మనపై అప్పుల భారం పెరుగుతుందని అర్థం. ఇక చాలామంది ఇళ్లల్లో కొన్నిసార్లు అనుకోకుండా పాము కనబడుతూ ఉంటుంది ఇలా పాము కనబడటం వల్ల ఏదైనా దోషం ఉందా అని భావిస్తూ ఉంటారు కానీ పాము కనబడటం లక్ష్మీదేవి రాకకు సూచిక అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంకేతాలు కనుక కనపడితే మీ పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!