Ram Gopal Varma: సినీ దిగ్గజం.. దాసరి నారణయణరావు చనిపోయిన తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే దానిపై పెద్ద చిక్కు వచ్చి పడింది. చాలామంది మెగస్టార్ చిరంజీవి అని భావిస్తుండగా.. పెద్దన్నగా మాత్రం తాను ఉండను అంటూ ఇటీవల అతడు వ్యాఖ్యలు చేసేశాడు.
దీని తర్వాత ఇండస్ట్రీలో ఈ టాపిక్ పెద్ద సంచలనంగా మారింది. సినీ ప్రముఖులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికీ తోచిన విధంగా వాళ్లు మాట్లాడేస్తున్నారు. చిరంజీవి అలా ప్రకటన చేసిన వెంటనే.. మోహన్ బాబు కూడా సినీ పరిశ్రమ విషయంలో మౌనంగా ఉంటున్నామని చేతకాని తనంగా అనుకోవద్దని ఘాటుగా మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశాడు.
సినీ పరిశ్రమ అంటే కేవలం నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు. అందరినీ సమానంగా చూడాలని.. అందరూ కలిసి.. పరిశ్రమ సమస్యలపై పోరాడాలన్నారు. ఒకరోజు కూర్చొని ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు అంటూ స్పష్టం చేశాడు.
టికెట్ల వ్యవహారంపైనే ప్రస్తుతం ఇదంతా తిరుగుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. టికెట్ల రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేసిందా.. ఆ ప్లాన్ వెనుకు సినిమాలో ఉన్న ఒకరిద్దరు హీరోల్ని తొక్కేయాల్నే కారణంగానే ఇలా చేస్తున్నారా..అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆర్జీవీ. ఆర్జీవీ ట్వీట్ పై అతడు శిష్యూడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు ట్వీట్ చేశాడు. సినీ పరిశ్రమకు మీరే పెద్ద దిక్కు ‘సామీ మీరు రావాలి సామీ’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇందతా జరుగుతున్నా.. కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజేవే అని.. కొందరు అంటుంటు.. మరి కొందరు మోహన్ బాటు అంటూ.. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…