Featured

Soundharya : అభినవ సావిత్రి సౌందర్య.. పాపం రెండు నెలల గర్భవతిగా ఉన్నప్పుడే మంటల్లో ఆహుతి కావాల్సివచ్చింది.!!

సావిత్రి ఈ మూడు అక్షరాల పేరు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఆమె సినీ ప్రవేశ తొలి రోజుల్లో పట్టుపరికిణీతో వెండితెరపై కనిపించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మహానటి తెరమరుగైన దశాబ్దకాలం తర్వాత దాదాపుగా అదే రూపంతో సౌమ్య అలియాస్ సౌందర్య వెండితెరపై కనిపించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.

శాండల్ వుడ్ కు సంబంధించిన రచయిత, దర్శకుడు, ప్రొడ్యూసర్ సత్యనారాయణ ‘గంధర్వ’ అనే చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే అందించారు. ఆ సినిమా విషయంలో బెంగళూరులో డబ్బింగ్ ధియేటర్ కి వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో సౌందర్య నాన్న గారితో వెళ్లారు. ‘గంధర్వ’ సినిమాకి మొదటి హీరోయిన్ ఎంపిక అయినప్పటికీ రెండో హీరోయిన్ కోసం వెతుకుతున్న దర్శకుడికి సౌందర్య కనిపించడంతో ఆ సినిమాలో నటించాల్సిందిగా సౌందర్యను కోరడం జరిగింది. ఆమె నాన్నగారు జోక్యం చేసుకొని తన అభిప్రాయం ఏంటో ఇంటికి వెళ్లి ఆలోచించి చెబుతుందన్నారు. అలా ఇంటికి వెళ్లిన సౌందర్యతో ఆమె అమ్మగారు, మావయ్య, అన్నయ్య సినిమాలో నటించమని సలహా ఇచ్చారు. కానీ ఎక్కడా ఆమెను ఒత్తిడి చేయలేదు. బాగా ఆలోచించిన సౌందర్య ఆ సినిమా కోసం పది రోజులు షూటింగ్ చేసుకోడానికి దర్శక,నిర్మాతలకు అవకాశం ఇచ్చారు.

అలా ఆమె అవకాశం ఇవ్వడంతో ‘గంధర్వ’ సినిమా పూర్తి చేశారు. ఆ సినిమాను చూసిన మరో కన్నడ దర్శకుడు తను తీయబోయే చిత్రంలో కూడా సౌందర్యను నటించమని కోరారు. కానీ తన చదువుకు ఇబ్బంది లేకుండా సెలవు రోజుల్లో మాత్రమే షూటింగ్ చేయాలి ఒకవేళ అత్యవసరం అనుకుంటే కాలేజీ అవర్స్ ముందు గానీ ఆ తర్వాత గానీ షూటింగ్ చేసుకోమని సౌందర్య చెప్పారు. ఆ తర్వాత నిర్మాత త్రిపురనేని కన్నడలో విడుదలైన ‘గంధర్వ’ చిత్రాన్ని చూసి తెలుగులో కృష్ణ హీరోగా తీస్తున్న ‘రైతుభారతం’ చిత్రంలో హీరోయిన్ కోసం సౌందర్యను సంప్రదించారు. కన్నడంలో ఇటు తెలుగులో అవకాశాలు రావడంతో.. అప్పటికే ఎమ్.బి.బి.ఎస్ కోర్స్ లో చేరి 9 నెలలే అవుతుంది. అంతటితో చదువుకు స్వస్తి చెప్పి తెలుగులో ‘రైతు భారతం’ చిత్రంలో కృష్ణతో నటిస్తూనే మనవరాలిపెళ్లి, అమ్మోరు చిత్రాలలో నటించడం మొదలు పెట్టారు.

అలా కొన్ని కారణాలతో ‘రైతుభారతం’ చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో ముందుగా తెలుగులో “మనవరాలి పెళ్లి” చిత్రం విడుదల అయ్యింది. అమ్మోరు,పెదరాయుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సౌందర్యకు మరింత పేరు వచ్చింది. ఆ తర్వాత పవిత్ర బంధం,పెళ్లి చేసుకుందాం, రాజా లాంటి చిత్రాలు ఆమెను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేశాయి. అమితాబ్ బచ్చన్ తో సూర్యవంశ్, రజినీకాంత్ తో నరసింహ, చిరంజీవితో చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించడంతో సౌందర్య క్రేజ్ అమాంతం ఆకాశాన్ని అంటుతుంది. 2002 గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో ‘ద్వీప’ అనే కన్నడ చిత్రంలో సౌందర్య నటించారు. ఈ సినిమాకి రెండు నేషనల్ అవార్డ్స్ తో పాటు నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.

సౌందర్య అలా తన క్రేజ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న సమయంలో తమ దగ్గర బంధువు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జి.ఎస్. రఘును 2003 ఎప్రిల్ 27న పెళ్లి చేసుకున్నారు. ఓ అనాధ ఆశ్రమాన్ని, “అమర్ సౌందర్య విద్యాలయాన్ని” స్థాపించారు. తన సోదరుడు సహకారంతో ఆమె వీటిని కొనసాగించేవారు. ఈ క్రమంలో పార్టీ ఆహ్వానం మేరకు సౌందర్య బిజెపిలో చేరారు. 2004లో లోక్ సభకు ఎన్నికలువచ్చాయి. బీజేపీ హైకమాండ్ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసాగర్రావు పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజవర్గం (కరీంనగర్)కు బెంగళూరు విమానాశ్రయం నుంచి సౌందర్య ఆమె సోదరుడు బయలుదేరారు.

Soundharya : ఆ సమయంలో సౌందర్య రెండు నెలల గర్భవతి

గాల్లోకి ఎగిరిన ఆ చార్టెడ్ విమానం కొన్ని క్షణాల్లోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయ మైదానంలో దింపడానికి ప్రయత్నం చేశారు. ల్యాండ్ అయ్యే అతి కొద్ది క్షణాల్లో విమానంలో ఒక్కసారిగా అగ్నిజ్వాలలు చెలరేగాయి. సౌందర్య ఆమె కడుపులో పెరుగుతున్న రెండు నెలల శిశువు, ఆమె సోదరుడు అమర్ నాథ్ సహా ఆ మంటల్లో ఆహుతి కావలసి వచ్చింది. కాలం వేసిన కాటుకు సౌందర్య కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. అమర్ నాథ్ భార్య.. ఒకప్పుడు సౌందర్య వీలునామా తమకే రాశారని ఆస్తి విషయంలో కోర్టుకు వెళ్లారు. ఆమెకు ప్రతి సవాలు చేస్తూ సౌందర్య తల్లి మరియు సౌందర్య భర్త జి.ఎస్. రఘు కూడా కోర్టును ఆశ్రయించారు. చివరికి 2013 లో ఉభయుల మధ్య సయోధ్య కుదిరి ఒక అంగీకారంతో ఆస్తులను పంచుకున్నారు. ‘నవరస నటనా మయూరి’ సౌందర్య మరణించిన ఇంకా తెలుగు ప్రేక్షకుల మనసులో ఆమె జ్ఞాపకాలు కదులుతూనే ఉన్నాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…

3 seconds ago

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…

30 minutes ago

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…

1 hour ago

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

2 hours ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

10 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

10 hours ago