General News

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

Rahul: దేశం కోసం మా కుటుంబం(నెహ్రూ కుటుంబం) ప్రాణ త్యాగాలు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, మోదీకి కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబ త్యాగాలకు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

పార్లమెంట్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలకు రాహుల్ ను మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. తాను లేవనెత్తిన అంశాలపై కాకుండా ఇతర అంశాలు మాట్లాడుతూ, తన ప్రశ్నల నుంచి తప్పించుకున్నారని రాహుల్ పేర్కొన్నారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

చైనా- పాక్ ఏకమవడం, రాజ్యాంగ ఉల్లంఘనలు, దేశంలో విభజన రాజకీయాలపై ప్రశ్నించినా సమాధానమే రాలేదన్నారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు.

తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతిగా..

మూడు గంటలకు పైగా ఆయన ప్రసంగంలో ఆ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ కుటుంబ పాలనే(గాంధీల కుటుంబం) కారణమని తిట్టిపోశారు. దేశంలో అత్యవసర పరిస్థితికి, సిక్కుల ఊచకోతకు కారణం కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బలహీనపరిచిందన్నారు. ఈ సందర్భంగా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తప్పుపట్టారు. సరైన చర్చ లేకుండా రాష్ర్టంను విడదీశారని ఆక్షేపించారు. పార్లమెంట్ తలుపులు మూసి అప్రజాస్వమిక పద్ధతుల్లో నాటి బిల్లును ఆమోదించారన్నారు. లోక్ సభలో పెప్పర్ స్ర్ప ఘటనలతో ఆనాడు హింస ఘటనలూ చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోకపోవడంతో నాటి సమస్యలు రెండు తెలుగు రాష్ర్టలలో ఇంకా నలుగుతూనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచారన్నారు. తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతి టి.అంజయ్య మరణాంతరం జరిగిన అవమానాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ ఆరోపణలకు మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అంటే భయమని, అందుకు నిదర్శనమే ఈ ప్రసంగమని ఆరోపించారు. తాను లేవనెత్తిన అంశాలను పక్కదోవపట్టించారన్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో చైనా – పాకిస్తాన్ దేశాలు ఒక్కటవుతున్నాయని ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాం. అయినప్పటికీ విషయమై సమాధానమే రాలేదన్నారు. ఈ వైఖరికి దేశ భద్రతకు మంచిది కాదన్నారు. కొవిడ్ మొదటి దశలోనూ మోదీ ప్రభుత్వానికి పలు చేసామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీనో, నెహ్రూ కుటుంబాన్నో విమర్శించడం కాదు మీరు(మోదీ) దేశ రక్షణకు చెప్పాలని డిమాండ్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పరమ వైభవాల పురాణపండ శ్రీ విష్ణు సహస్రంను గాన సభ ఉచితంగా అందిస్తోంది..

ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…

12 hours ago

Srimalika : బొల్లినేని చేతుల మీదుగా శైలజాకిరణ్‌కు పురాణపండ శ్రీమాలిక!

అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…

3 days ago

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

3 weeks ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

3 weeks ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

3 weeks ago

చేపలతో ఇవి కలిపి తింటే ప్రమాదమే! ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…

3 weeks ago