ఈ కరోనా వచ్చినప్పటినుంచి జనాలు సినిమా థియేటర్లకు వెళ్లడమే మానేశారు.. ముఖ్యంగా అందరూ ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాం లకు మొగ్గుచూపుతున్నారు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ లదే హవా నడుస్తోంది..సోషల్ మీడియా ఎకౌంట్ లో ఫాలోవర్స్ ఎంత ఎక్కవ మంది ఉంటే, అంతగా పాపులారిటీ ఉన్నట్టు.. సినిమా ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీస్ కి కూడా సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉంటే అది అంత పెద్ద బలం అన్నట్టుగా తయారైంది.
ఇప్పటికే అల్లు అరవింద్ అడ్వాన్స్ డ్ గా ఆలోచించి సొంత ఓటీటీ-ఆహాను నెలకొల్పి దాన్ని ఫుల్ సక్సెస్ చేశారు.కేవలం ఏడాది కాలంలోనే ఆహాకి విశేష ఆదరణ దక్కింది. పైగా డిజిటల్ కంటెంట్ విషయంలో కూడా అల్లు అరవింద్ చాల కొత్తగా ఆలోచించారు. అందుకే అల్లు అరవింద్ విజయవంతంగా తన ఆహాను నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీకి భవిష్యత్తు ఉందని మిగిలిన వాళ్లకు కూడా అర్ధమైంది.
అసలుకే తెలుగు ఇండస్ట్రీలో కింగ్ నాగార్జునకి బడా బిజినెస్ మేన్ గా మంచి పేరు ఉంది.ఎలాగూ ఓటిటీకి సక్సెస్ ఫుల్ ఫ్యూచర్ ఉందని నేటి పరిస్థితులు ప్రూవ్ చేస్తున్నాయి కాబట్టి.. తానూ ఎందుకు ఓటిటీ సంస్థను పెట్టకూడదు అని ఆలోచనలో పడ్డాడట నాగ్. పైగా థియేటర్లతో సంబంధం లేకుండా ఓటీటీలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీనికి తోడు కరోనా కూడా ఓటిటీలకు పెద్ద ప్లస్ అయింది. జనం థియేటర్స్ కి వెళ్లడం మానేసారు. చక్కగా ఇంట్లోనే కూర్చుని ఓటిటీలో తమకు నచ్చిన సినిమాని చూసుకుంటున్నారు.అన్నిటికి మించి ఓటీటీలో నష్టాలు తక్కువుగా కనిపిస్తున్నాయి.
పైగా అక్కినేని కుటుంబంలో కూడా ఐదుగురు హీరోలు ఉన్నారు. ఏడాదికి అక్కినేని ఫ్యామిలీ నుండి ఏడు ఎనిమిది సినిమాలు వస్తున్నాయి. అలాగే అక్కినేని బ్యానర్ పై చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటారు. అక్కినేని ఫిల్మ్ స్కూల్ నుండి కూడా స్టూడెంట్స్ ఏడాదికి వందల మంది బయటకు వస్తున్నారు. వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.అందుకే మెగాస్టార్ తో లేదా మరో పార్ట్నర్ తో కలిసి నాగార్జున సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి కింగ్ నాగార్జునతో ఎవరు భాగస్వామ్యం అవుతారో చూడాలి…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…