Pallavi prashanth Father: బిగ్ బాస్ కార్యక్రమంలో రైతుబిడ్డ గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఒక రైతు బిడ్డ సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి ట్రోఫీ అందుకున్నారని సంతోషపడేలోపు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహం కనబరుస్తూ ఇతర సెలబ్రిటీల కార్లపై రాళ్ల దాడి చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులను రెచ్చగొట్టారు అంటూ పోలీసులు తనని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా గెలిచిన కొన్ని గంటలలోనే ఈయన తిరిగి జైలుకు వెళ్లడంతో ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక రైతు బిడ్డగా నా కొడుకు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి గెలిచారని చాలా సంతోషపడ్డాం. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు ఉండనివ్వలేదని నా కొడుకు పై తప్పుడు కేసులు, రాతలు రాస్తూ తనని జైలుకు పంపించారని ఎమోషనల్ అయ్యారు.
నా కొడుకు ఒక రైతుబిడ్డ కావడంతోనే ఇలా కక్ష కట్టారని అదే ఒక సెలబ్రిటీ అయితే వారిని అరెస్టు చేసే వాళ్ళ అంటూ కూడా ఈయన ప్రశ్నించారు. ఇందులో నా కొడుకు తప్పు ఏమీ లేదని అప్పుడు నేను నా కొడుకు పక్కనే ఉన్నానని కూడా సత్యనారాయణ తెలిపారు. ఒక రైతు బిడ్డగా నా కొడుకు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటేనే బాగుండేది ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.
తప్పుడు రాతలు రాశారు..
మాది ఒక మారుమూల గ్రామం రాత్రి వచ్చి నా కొడుకును తీసుకువెళ్లారు మాకు బెయిల్ తీసుకోవడం లాంటివి కూడా తెలియదు నా ఇద్దరు కొడుకులను పోలీసులు తీసుకెళ్లడంతో నా భార్య అనారోగ్యానికి గురైందని కొడుకులపై బెంగ పెట్టుకొని ఏడుస్తూనే ఉంది అంటూ ఈ సందర్భంగా సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…