ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు అమ్మఒడి స్కీమ్ గురించి కీలక ప్రకటన చేశారు. 2020 – 2021 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు తమ వివరాలను వెబ్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవాలని సూచించారు.
అధికారులతో ఈ స్కీమ్ గురించి సమీక్ష నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ స్కీమ్ కు అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రులు వెబ్ పోర్టల్ లో నమోదైన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, రైస్ కార్డు నెంబర్ అన్నీ చెక్ చేసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ఏవైనా తప్పులు ఉంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి తప్పులు సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన విద్యార్థినీవిద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున జమ చేస్తోంది. అర్హులైన వారికి జనవరి నెల తొలి వారంలో అమ్మఒడి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమవుతాయి. ప్రభుత్వం గతేడాది నుంచి అమ్మఒడి స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఈ నెల 15వ తేదీలోగా అరులైన విద్యార్థులు వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దారిద్రరేఖకు దిగువన ఉండి బియ్యం కార్డ్ ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులవుతారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల డేటాను పంపాలంటే విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలని నిబంధనలు విధిస్తున్నట్టు తెలుస్తోంది.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…