రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల బీసీ సామాజిక వర్గాలే కేంద్రబిందువుగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ దీనికి అవసరమైన ఆమోదం ఇంకా లభించలేదు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లో బీసీలకు అధిక సంఖ్యలో సీట్లు కేటాయించడం ద్వారా పార్టీలూ తమ హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఇదే దారిలో అడుగులు వేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలూ బీసీ అభ్యర్థులకే పెద్దపీట వేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో బీసీ టికెట్లు గణనీయంగా పెరిగాయి. మొత్తం సీట్లలో కాంగ్రెస్ పార్టీ 53.71 శాతం బీసీలకు కేటాయించగా, బీఆర్ఎస్ స్వల్పంగా ముందంజలో నిలిచి 53.79 శాతం సీట్లు ఇచ్చింది. బీజేపీ మాత్రం 49.89 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది.
గమనించదగ్గ అంశం ఏంటంటే… 42 శాతం రిజర్వేషన్ హామీని మించిపోయేలా పార్టీలు సీట్లు ఇవ్వడం. కొన్ని జిల్లాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 67.66 శాతం సీట్లు బీసీలకు కేటాయించింది. అదే జిల్లాలో బీఆర్ఎస్ 60 శాతం, బీజేపీ 61 శాతం సీట్లు ఇచ్చాయి. కొన్ని చోట్ల అధికార పార్టీకంటే ప్రతిపక్షమే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఉదాహరణలూ ఉన్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మునిసిపాలిటీల్లో మొత్తం 294 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 127 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 121 మంది బీసీలను బరిలోకి దించింది. బైంసా మునిసిపాలిటీలో బీఆర్ఎస్ 46 శాతం వార్డులను బీసీలకు కేటాయించగా, కాంగ్రెస్ 26 శాతం మాత్రమే ఇచ్చింది. నిర్మల్లో బీజేపీ ఏకంగా 90 శాతం సీట్లు బీసీలకు ఇవ్వగా, బీఆర్ఎస్ 71 శాతం, కాంగ్రెస్ 57 శాతం సీట్లు కేటాయించడం గమనార్హం.
బీసీల తర్వాత ఎస్సీ వర్గాలకు కాంగ్రెస్ 19 శాతం, బీఆర్ఎస్ 18.66 శాతం, బీజేపీ 15.80 శాతం సీట్లు ఇచ్చాయి. ఎస్టీల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ సమానంగా 7.66 శాతం సీట్లు కేటాయించగా, బీజేపీ 7.05 శాతం సీట్లు ఇచ్చింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో పోటీ చిత్రమే స్పష్టమైంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీల్లో 2,582 వార్డులు, ఏడు కార్పొరేషన్లలో 414 డివిజన్లు కలిపి మొత్తం 2,996 స్థానాలు ఉన్నాయి. వీటికి మొత్తం 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…