General News

Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..

Air Indian Flight:సాధారణంగా రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్యలో తిరుగుతూ ఓట్ల కోసం పెద్ద ఎత్తున తాపత్రయ పడుతుంటారు. ఇలా ఎన్నికల సమయంలో కాకుండా మిగతా సమయంలో ప్రజలలోకి రావడానికి రాజకీయ నాయకులు పెద్దగా ఆసక్తి కనపరిచరు. అయితే కొంతమంది నేతలు మాత్రం ఇందుకు చాలా భిన్నంగా ఉంటారు. వాళ్లు నిత్యం ప్రజల కోసమే కృషి చేస్తూ.. ప్రజల సమస్యలను తీరుస్తూ నిజమైన ప్రజానాయకుడు గా వ్యవహరిస్తారు.

Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..

తాజాగా కేంద్ర మంత్రి చేసిన పని తెలిస్తే ప్రతి ఒక్కరూ అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేరు. అసలేం జరిగిందనే విషయానికి వస్తే..శనివారం ఢిల్లీ-ఔరంగాబాద్ ఎయిరిండియా విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన విమాన సిబ్బంది వెంటనే విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే స్పందించాల్సి ఉంది అంటూ అనౌన్స్మెంట్ చేశారు. ఈ విధంగా అనౌన్స్మెంట్ విన్న కేంద్ర మంత్రి డాక్టర్ బీకే కరాద్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత డాక్టర్ సుభాష్ భమ్రే వెంటనే స్పందించారు.

Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..

ఈ క్రమంలోనే ఇద్దరు ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని అతనికి చికిత్స అందించారు. ఇలా ప్రాథమిక చికిత్స అందించడంతో ఆ ప్రయాణికుడు త్వరగా ఉపశమనం పొందారు. వీరిద్దరూ ఒకరు కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తుండగా మరొకరు మాజీ మంత్రి ఇలా వీరిద్దరూ రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా వృత్తి పరంగా ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్లు.

ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసిన ఎయిర్ ఇండియా…

ప్రస్తుతం వీరిద్దరూ మంత్రి పదవులలో ఉన్నప్పటికీ ఒక రోగి పట్ల డాక్టర్ గా వ్యవహరించి ఆయనకు చికిత్స అందించడంతో కేంద్ర మంత్రి పై నెటిజన్లు పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వారిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

2 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

2 hours ago

యంగ్ ఏజ్‌లోనే లివర్ రిస్క్.. ఫ్యాటీ లివర్‌కు ఆహారమే కారణమా? కొత్త అధ్యయనం ఏమంటోంది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…

2 hours ago

రహానేకు డబుల్ షాక్.. ఓటమి + రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…

2 hours ago

వెంకీ కెరీర్ మార్చిన సినిమా.. సిరివెన్నెల ఆసక్తికర విశ్లేషణ

తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…

3 hours ago

అండమాన్ సముద్రంలో విషాదం.. 250 మంది గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…

3 hours ago