Pastor Salem Raju's controversial comments on women.. video goes viral!
చిలకలూరిపేటకు చెందిన పాస్టర్ షాలెం రాజు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఒక ప్రార్థనా సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా మల్లెపూలు పెట్టుకునే మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో హిందూ, మహిళా సంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి.
ఒక మల్లెపూల వ్యాపారి చర్చ్ ముందు దుకాణం పెట్టాడట. కానీ అక్కడ మహిళలు మల్లెపూలు కొనడం తగ్గిపోయిందని గమనించిన పాస్టర్, అతనికి “ఇక్కడ ఎవ్వరూ బజారు మహిళలు కావు.. పరిశుద్ధ ఆత్మ గలవాళ్లు మాత్రమే ఉన్నారు” అన్నట్లుగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన హిందూ మహిళలను తక్కువ చేసి మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. హిందూ సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి, ఇప్పటికే సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ‘సంతోషి సేవా పరిషత్’ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
పాస్టర్ షాలెం రాజు అసలు పేరు బండారు వీరయ్య కాగా, వడ్డెర కులానికి చెందిన ఆయన పూర్వంలో కూలీపనులు చేసేవారని సమాచారం. ఇప్పుడు క్రైస్తవ ప్రచారం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడి చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాత్రివేళ గది లైట్లు ఆఫ్ చేసి మొబైల్ స్క్రోల్ చేయడం చాలామందికి అలవాటు. మంచంలో పడుకుని మసక వెలుతురులో ఫోన్…
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఇప్పటివరకు మిశ్రమంగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్లో ఒక్కో బ్యాటర్ మెరిసినా, మొత్తం…
తెలంగాణ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అరుదైన అవకాశం దక్కింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి…
ప్రకృతి ప్రసాదించిన పౌష్టికాహారాల్లో ఖర్జూరాలు ముందుంటాయి. ఉపవాసాల సమయంలోనైనా, అలసటగా అనిపించినప్పుడైనా చాలామంది వెంటనే ఖర్జూరాలనే తీసుకుంటారు. తక్షణ శక్తిని…
డిజిటల్ యుగంలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా చాలా మంది ముందుగా గూగుల్లోనే వెతుకుతున్నారు. జ్వరమా, దగ్గు లేదా…
తెలుగు సినీప్రియుల మనసుల్లో ఇప్పటికీ చెరిగిపోని ప్రేమకథల్లో ఒకటి తొలి ప్రేమ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేక…