General News

Air India పైలట్కు సెల్యూట్.. ప్రమాద సమయంలో చూపిన ధైర్యం గొప్పది! ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నాడంటే?

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. దాదాపు 240 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన గురువారం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ A-171 విమానం, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది.

Salute to Air India pilot.. What does the eyewitness say?

విమాన ప్రమాదం సమయంలో పైలట్ తీసుకున్న యత్నం గురించి ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ‘‘మేఘానీ నగరంలో మొదట బస్టాండ్‌పై విమానం ల్యాండ్ అవుతుందనుకున్నాం. కానీ పైలట్ చివరి నిమిషంలో విమానాన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఓ ఖాళీ స్థలంలో ల్యాండ్ చేయాలని ప్రయత్నించారు. కానీ అక్కడ వేప చెట్టు, హాస్టల్ బిల్డింగ్ అడ్డంకిగా మారాయి’’ అని చెప్పారు.

చివరకు, విమానం వేప చెట్టును తాకిన వెంటనే అదుపు తప్పి, బీజే మెడికల్ కాలేజీ డాక్టర్ల హాస్టల్ భవనంపై కూలిపోయిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు, ప్రత్యక్ష వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ప్రమాద సమయంలో పైలట్ చేసిన ప్రయత్నానికి నెటిజన్లు, ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. “అతని ధైర్యం, శ్రమ వృథా కాకూడదని అనిపిస్తోంది. చివరి వరకు ప్రయాణికుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశాడు” అంటూ పలువురు కంటతడి పెట్టారు.

telugudesk

Recent Posts

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

15 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

45 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

1 hour ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

1 hour ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

2 hours ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

2 hours ago