Political News

YS Sharmila : “వైఎస్ జగన్‌ బీజేపీకి దత్తపుత్రుడు..” షర్మిల షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వారిని జగన్ పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. ‘‘బెట్టింగ్ యాప్‌లకు బానిసలైన వారికి విగ్రహాలు కడతారా? ఇది ఏ రకమైన ఉదాహరణ? సమాజం ఎటు పోతుంది’’ అంటూ వైయస్ జగన్ ను ఆమె నిలదీశారు.

“YS Jagan is the adopted son of BJP..” Sharmila’s shocking comments!

ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిందిగా సూచించిన షర్మిల, జగన్‌కి ప్రజల కష్టాలు పట్టవని, బల ప్రదర్శనలు చేయడమే ముఖ్యమని విమర్శించారు. ‘‘జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కావడంతో కేంద్రం నుంచి అనుమతులన్నీ సంపూర్ణంగా వస్తున్నాయి’’ అని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు మాత్రం అనవసర ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం పోరాడితే హౌస్ అరెస్టు చేస్తారు, స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలు చేస్తే అడ్డుకుంటారు. ఇదెక్కడి న్యాయం?’’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ యాత్రలకు మాత్రం ఏ ఆంక్షలు లేకుండా జరుగుతుండడాన్ని ఆమె సమానత్వానికి విరుద్ధంగా అభివర్ణించారు.

‘‘జగన్ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి పోలీసులను కూడా కొనగలడు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పరామర్శ కార్యక్రమంలో ఇద్దరి మృతి చెందినదాన్ని ప్రస్తావిస్తూ, ‘‘ఆ మరణాలకు బాధ్యులు ఎవరు?’’ అని ప్రశ్నించారు. కార్యక్రమానికి 100 మందికి అనుమతి ఇస్తే వేల మంది ఎలా చేరారని, పోలీసుల తీరుపై కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. ‘‘పోలీసు శాఖ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందని’’ పేర్కొన్నారు.

telugudesk

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

19 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

19 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

20 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

20 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

22 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

22 hours ago