Pastor Salem Raju's controversial comments on women.. video goes viral!
చిలకలూరిపేటకు చెందిన పాస్టర్ షాలెం రాజు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఒక ప్రార్థనా సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా మల్లెపూలు పెట్టుకునే మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో హిందూ, మహిళా సంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి.
ఒక మల్లెపూల వ్యాపారి చర్చ్ ముందు దుకాణం పెట్టాడట. కానీ అక్కడ మహిళలు మల్లెపూలు కొనడం తగ్గిపోయిందని గమనించిన పాస్టర్, అతనికి “ఇక్కడ ఎవ్వరూ బజారు మహిళలు కావు.. పరిశుద్ధ ఆత్మ గలవాళ్లు మాత్రమే ఉన్నారు” అన్నట్లుగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన హిందూ మహిళలను తక్కువ చేసి మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. హిందూ సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి, ఇప్పటికే సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ‘సంతోషి సేవా పరిషత్’ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
పాస్టర్ షాలెం రాజు అసలు పేరు బండారు వీరయ్య కాగా, వడ్డెర కులానికి చెందిన ఆయన పూర్వంలో కూలీపనులు చేసేవారని సమాచారం. ఇప్పుడు క్రైస్తవ ప్రచారం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడి చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…