Pastor Salem Raju's controversial comments on women.. video goes viral!
చిలకలూరిపేటకు చెందిన పాస్టర్ షాలెం రాజు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఒక ప్రార్థనా సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా మల్లెపూలు పెట్టుకునే మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో హిందూ, మహిళా సంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి.
ఒక మల్లెపూల వ్యాపారి చర్చ్ ముందు దుకాణం పెట్టాడట. కానీ అక్కడ మహిళలు మల్లెపూలు కొనడం తగ్గిపోయిందని గమనించిన పాస్టర్, అతనికి “ఇక్కడ ఎవ్వరూ బజారు మహిళలు కావు.. పరిశుద్ధ ఆత్మ గలవాళ్లు మాత్రమే ఉన్నారు” అన్నట్లుగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన హిందూ మహిళలను తక్కువ చేసి మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. హిందూ సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి, ఇప్పటికే సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ‘సంతోషి సేవా పరిషత్’ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
పాస్టర్ షాలెం రాజు అసలు పేరు బండారు వీరయ్య కాగా, వడ్డెర కులానికి చెందిన ఆయన పూర్వంలో కూలీపనులు చేసేవారని సమాచారం. ఇప్పుడు క్రైస్తవ ప్రచారం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడి చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…