అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. దాదాపు 240 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన గురువారం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన బోయింగ్ A-171 విమానం, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది.

విమాన ప్రమాదం సమయంలో పైలట్ తీసుకున్న యత్నం గురించి ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ‘‘మేఘానీ నగరంలో మొదట బస్టాండ్పై విమానం ల్యాండ్ అవుతుందనుకున్నాం. కానీ పైలట్ చివరి నిమిషంలో విమానాన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఓ ఖాళీ స్థలంలో ల్యాండ్ చేయాలని ప్రయత్నించారు. కానీ అక్కడ వేప చెట్టు, హాస్టల్ బిల్డింగ్ అడ్డంకిగా మారాయి’’ అని చెప్పారు.
చివరకు, విమానం వేప చెట్టును తాకిన వెంటనే అదుపు తప్పి, బీజే మెడికల్ కాలేజీ డాక్టర్ల హాస్టల్ భవనంపై కూలిపోయిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు, ప్రత్యక్ష వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ ప్రమాద సమయంలో పైలట్ చేసిన ప్రయత్నానికి నెటిజన్లు, ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. “అతని ధైర్యం, శ్రమ వృథా కాకూడదని అనిపిస్తోంది. చివరి వరకు ప్రయాణికుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశాడు” అంటూ పలువురు కంటతడి పెట్టారు.
Air India Plane Crash: ప్రమాదానికి ముందు పైలట్ చేసిన ప్రయత్నాన్ని చెబుతున్న ప్రత్యక్ష సాక్షి#PlaneCrash #Ahmedabad #AirIndia pic.twitter.com/PErueKdYz7
— BBC News Telugu (@bbcnewstelugu) June 19, 2025




























