Pavithra Lokesh : గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో బాగా నానుతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ఉదంతం రోజుకో మలుపు తిరుగుతూ వైరల్ అవుతోంది. తెలుగులో సీనియర్ నటుడు విజయ నిర్మల కొడుకు నరేష్ నాలుగోసారి పెళ్ళికి సిద్ధమయ్యారంటూ మీడియా కోడై కూసింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. ఇక వీటిమీద ఈ ఇద్దరూ మొదట డైరెక్టగా స్పందించలేదు. మొన్నామధ్య మహాభలేశ్వరంలో కనిపించి మరింత అనుమానాలు పెంచేసారు.
పవిత్ర కు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి…
ఇక నరేష్ కు ఇది నాలుగో బంధం కాగా, ఇక పవిత్రకు రెండో బంధం అని మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ కన్నడ ఆర్టిస్ట్ ఆయనతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అందరికి తెలుసు. కానీ సుచేంద్ర ప్రసాద్ తో నాకు పెళ్లి కాలేదని ఇద్దరం కేవలం సహజీవనం చేశామని పవిత్ర బాంబు పేల్చింది. ఇక తాజాగా పవిత్ర మీద కన్నడ న్యూస్ ఛానెల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో తాను నరేష్ తో సహజీవనం చేస్తున్నట్లు పవిత్ర ఒప్పుకున్నారు. ఇక ఈ విషయంలో గురించి పవిత్ర మొదటి భర్త సుచ్చేంద్ర ప్రసాద్ స్పందించారు.
పవిత్ర క్యారెక్టర్ మంచిది కాదని, తాను పిల్లలను నన్ను వదిలి వెళ్ళిపోయాక చాలా హ్యాపీగా ఉన్నాము. పవిత్రకు నాతో ఉన్నపుడే వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని నా దృష్టికి వచ్చిందని అయితే తన మీద ప్రేమ వల్ల నేను పట్టించుకోలేదని, ఇక నాకంటే ముందు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం జరిగిందని, అతనితోను ఎక్కువ రోజులు ఉండలేదని, తనకు కావాల్సింది డబ్బు మాత్రమే అని చెప్పారు. ఇపుడు కూడా నరేష్ తో పెళ్లి జరిగినా ఆరు నెలల తరువాత తన ఆస్తి తీసుకుని వీడిపోతుంది పవిత్రకు కావాల్సింది డబ్బు, లగ్జరీ జీవితం మాత్రమే అని సుచేంద్ర ఘాటుగా స్పందించారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…