Movie News

Geetha Krishna : అసలు మాట్లాడటం రాదు, బాహుబలి తరువాత అవేమైనా సినిమాలా… ప్రభాస్ కి బుర్రలేదని ఎప్పుడో చెప్పాను… : డైరెక్టర్ గీతాక్రిష్ణ

Geetha Krishna : ప్రభాస్ ఈశ్వర్ సినిమా చేసి 20 ఏళ్ల సందర్బంగా చాలా మంది ఆయన సినిమా ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఈశ్వర్ నుండి బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమా ద్వారా ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్నాడు. చిన్నగా మొదలైన తన కెరీర్ ఇపుడు హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళింది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ ఇరవై ఏళ్ల కెరీర్ గురించి గీత కృష్ణ కామెంట్స్ చేసారు.

మాట్లాడటమే రాదు, స్టోరీ సెలక్షన్ తెలియదు…

ప్రభాస్ ఈశ్వర్ సినిమా కంటే ముందే తనకు తెలుసని, కాకినాడలో ఉన్నప్పుడు తెలుసనీ చాలా అందంగా ఉంటాడని చెప్పారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గారు, ఆయన మొదటి భార్య, వీళ్లందరు బాగా తెలుసనీ ప్రభాస్ కు సినిమాల్లోకి రావాలని ప్లాన్ ఏం లేదని, కాకపోతే తన పెదనాన్న తరువాత సినిమాల్లో ఉండాలన్న కుటుంబం ఆశతో వచ్చాడని, చదువులో కూడా పెద్దగా చదివేవాడు కాదంటూ చెప్పారు. ఇక రాజమౌళి చేతిలో పడ్డాక స్టార్ హీరో అయ్యాడని చెప్పాడు. ఒక్క బాహుబలి సినిమాతో చిరంజీవి కి ఉన్న స్టార్ డమ్, చిరంజీవికి మించిన స్టార్ డమ్ వచ్చిందని చెప్పారు.

అయితే ప్రభాస్ కు అంత బుర్ర లేదని అందుకే బాహుబలి తరువాత సినిమాలు ప్లాప్ అయ్యాయని చెప్పాడు. సాహో ఒక డిజాస్టర్ అయితే రాధే శ్యామ్ అంతకన్నా పెద్ద డిజాస్టర్ అని వర్ణించాడు. స్క్రిప్ట్ ఎంపిక ప్రభాస్ కి రాదని అందుకే అలాంటి చెత్త సినిమాలు చేశాడంటూ చెప్పాడు. మరి వీటిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

4 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

4 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

4 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

4 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

5 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

5 hours ago