Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కూడా తనదైన ముద్ర వేయించుకున్నారు. ఒకవైపు రాష్ట్ర రాజకీయాలను అలాగే సినిమాలలో దూసుకుపోతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయనకు సినిమాల పరంగా రాజకీయ పరంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఎవరైనా ఒక్క మాట మాట్లాడిన సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఏ స్థాయిలో రెచ్చిపోయి కామెంట్లు చేస్తారో మనకు తెలుస్తుంది.
ఇకపోతే హీరో రాజా అప్పట్లో వైయస్సార్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఇకపోతే రాజకీయపార్టీలో ఉన్న రాజా రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివితే నీకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి అంటూ అతని పై కామెంట్ చేశారు.ఇలా పవన్ కళ్యాణ్ ను అనడంతో ఒక్క సారిగా పవన్ అభిమానులు రెచ్చిపోయి తన తల్లి భార్య కూతురుని దారుణంగా అసభ్యకరమైన కామెంట్ చేస్తూ దూషించారు.
ఇకపోతే ప్రస్తుతం రాజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ దేవుడు సువార్తలు చెబుతూ ఉన్నారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన కామెంట్ల గురించి ప్రస్తావించారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చాలా మంచివారు. ఆయన తనలో ఉన్న ఎమోషన్స్ ఆపుకోలేరు. నేను అతనితో కలిసి పని చేశాను ఆయన ఎలాంటి వ్యక్తి అనే విషయం నాకు తెలుసు.కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన గురించి ప్రస్తావించాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఎంతో ముందుకు వెళ్లాలని ఎన్నో పథకాలు రచించారు. అయితే ఆయన రాజకీయాలకు అభిమానులే అడ్డుగా మారారు. అభిమానులు ఇలాంటి కామెంట్లు చేయడం అందరిపై దూషించడం వల్ల ఆయన రాజకీయ ప్రస్థానానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.వారు తెలుసుకొని ఇలాంటివి మానుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని ఈ సందర్భంగా రాజా మాట్లాడారు. అయితే అభిమానులు చేసిన ఈ కామెంట్ లకు పవన్ కళ్యాణ్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు.అతని ఫ్యాన్స్ అలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందులు ఎదురవుతాయని రాజా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…