Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు వారాహి రెండవ దశ యాత్ర కూడా మొదలుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన పలు ప్రాంతాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న క్రమంలోనే వాలంటీర్లను టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా భగ్గుమన్నటువంటి వాలంటీర్లు అలాగే వైయస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించడమే కాకుండా ఆయనకు తమ స్టైల్ లో సమాధానం చెబుతున్నారు.
వైఎస్ఆర్సిపి నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి నేతలు తన భార్య గురించి మాట్లాడటంతో ఆమె ఏడుస్తుంది అంటూ కామెంట్ చేశారు. తన భార్య ఏడుస్తుందంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒకవైపు వారాహి యాత్రలో బిజీగా ఉంటూనే మరోవైపు పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఈనెల 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అలాగే సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…