సాధారణంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారు డయాలసిస్ చేయించుకుంటూ వుంటారు. అయితే ఈ విధంగా డయాలసిస్ చేయించుకునేవారు ఒక డయాలసిస్ సెషన్కీ డయాలసిస్ చేయించుకుంటున్న వ్యక్తి సుమారుగా 16 గ్రాముల ప్రోటీన్ లను కోల్పోవలసి వస్తుంది. ఈ క్రమంలోనే వారి శరీరానికి తగినంత ప్రొటీన్ అవసరం ఎంతో ఉంటుంది. అయితే ప్రోటీన్లు మన శరీరానికి పుష్కలంగా లభించాలంటే తగినంత మాంసాహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి.
ఈ క్రమంలోనే డయాలసిస్ చేయించుకున్న పేషెంట్లు శాకాహారులైతే వారు ప్రొటీన్ల కోసం ప్రత్యేకించి మాంసాహారం తినాల్సిన పని లేదు. ఎందుకంటే మాంసాహారంలో లభించే టటువంటి ప్రొటీన్లు అన్ని శాకాహార పదార్థాలలో కూడా మనకు లభ్యమవుతాయి. మీరు తీసుకునే ఆహార పదార్థాలతోపాటు ఫాస్ఫేట్ బైండర్స్ తీసుకోవటం వల్ల మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందుతాయి.ఈ విధంగా డయాలసిస్ చేయించుకున్న శాఖాహారులు కోల్పోయిన ప్రోటీన్లను తిరిగి పెంపొందించుకోవాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
ప్రొటీన్లు అధికంగా లభించేటటువంటి మీల్ మేకర్, సోయా మిల్క్, సోయా ఫ్లేక్స్, తోఫూ వంటి సోయా అధికంగా తీసుకోవటం వల్ల తగినన్ని ప్రొటీన్లు పొందవచ్చు. అధిక మొత్తంలో పాలు పాల పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినన్ని ప్రొటీన్లు అందుతాయి. వీటితోపాటు ప్రతిరోజు బీన్స్, పప్పు దినుసులను అధికంగా తీసుకోవడం వల్ల డయాలసిస్ పేషంట్ లు కోల్పోయిన ప్రొటీన్లను పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…