Categories: FeaturedGeneral News

పెప్సీ కోసం యుద్ధ నౌకలను అమ్మేసిన దేశం ఏదో తెలుసా..?

ప్రస్తుత కాలంలో ఒక వస్తువును కొనాలంటే మనం డబ్బులు చెల్లించి కొంటున్నాం కానీ గతంలో వస్తు మార్పిడి విధానం ద్వారా క్రయవిక్రయాలు జరిగేవి. మన దగ్గర ఉన్న వస్తువును అవతలి వ్యక్తులకు ఇచ్చి అవతలి వ్యక్తులు ఇచ్చిన వస్తువులను మనం తీసుకునేవాళ్లం. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా క్రయవిక్రయాలు ఇదే విధంగా జరిగేవి. ఆ తరువాత కాలంలో డబ్బు అందుబాటులోకి రావడంతో డబ్బు చెల్లించి వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.

చాలా దేశాలు, కంపెనీలు వాటికి అవసరమైన ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడతాయి. అందుకోసం దేశాలకు అవతలి దేశాల్లోని ఎగుమతి చేసే సంస్థలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ధనిక దేశాలకు డబ్బులు చెల్లించడం సులువే కానీ పేద దేశాలకు డబ్బులు చెల్లించి దిగుమతి చేసుకోవడం అంత సులభం కాదు. అయితే ఒక దేశం పెప్సీ కూల్ డ్రింక్ కోసం ఏకంగా యుద్ధ నౌకలను అమ్మేసింది.

శీతల పానీయాల కోసం యుద్ధ నౌకలను ఒక దేశం అమ్మిందని చెబితే ఎవరైనా ఘొల్లున నవ్వుతారు. మరికొందరైతే ఆ మాటల్లో నిజం లేదని చెబుతారు. కానీ ఒకప్పటి సోవియట్ యూనియన్(ఉమ్మడి రష్యా) పెప్సీ కూల్ డ్రింక్ కోసం యుద్ధ నౌకలను అమ్మాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొంది. 1959 సంవత్సరంలో సోవియట్ సర్కార్ అమెరికాకు టెక్నాలజీని పరిచయం చేసింది. అందుకోసం న్యూయార్క్ లో భారీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.

ఈ ఎగ్జిబిషన్ తరువాత మాస్కోలో అమెరికా తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో సోవియట్ యూనియన్(ఉమ్మడి రష్యా) ఉపాధ్యక్షుడు క్రుషేవ్, అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ఇద్దరి మధ్య పెట్టుబడిదారీ విధానానికి సంబంధించి వివాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో పెప్సీను రుచి చూసిన క్రుషేవ్ దిగుమతి చేసుకోవాలని భావించి పెప్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సోవియట్ అమెరికాకు పెప్సీ దిగుమతికి బదులుగా వోడ్కాను ఎగుమతి చేసేది.

అయితే 1990లో సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడం వల్ల అమెరికా సోవియట్ ఉత్పత్తులపై నిషేధం విధించింది.. అయితే సోవియట్ మాత్రం పెప్సీ దిగుమతి చేసుకోవాలని భావించి అందుకు తగిన డబ్బు లేకపోవడంతో యుద్ధనౌకలను పెప్సీకి అమ్మేసింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago