Connect with us

Featured

పెప్సీ కోసం యుద్ధ నౌకలను అమ్మేసిన దేశం ఏదో తెలుసా..?

Published

on

ప్రస్తుత కాలంలో ఒక వస్తువును కొనాలంటే మనం డబ్బులు చెల్లించి కొంటున్నాం కానీ గతంలో వస్తు మార్పిడి విధానం ద్వారా క్రయవిక్రయాలు జరిగేవి. మన దగ్గర ఉన్న వస్తువును అవతలి వ్యక్తులకు ఇచ్చి అవతలి వ్యక్తులు ఇచ్చిన వస్తువులను మనం తీసుకునేవాళ్లం. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా క్రయవిక్రయాలు ఇదే విధంగా జరిగేవి. ఆ తరువాత కాలంలో డబ్బు అందుబాటులోకి రావడంతో డబ్బు చెల్లించి వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.

చాలా దేశాలు, కంపెనీలు వాటికి అవసరమైన ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడతాయి. అందుకోసం దేశాలకు అవతలి దేశాల్లోని ఎగుమతి చేసే సంస్థలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ధనిక దేశాలకు డబ్బులు చెల్లించడం సులువే కానీ పేద దేశాలకు డబ్బులు చెల్లించి దిగుమతి చేసుకోవడం అంత సులభం కాదు. అయితే ఒక దేశం పెప్సీ కూల్ డ్రింక్ కోసం ఏకంగా యుద్ధ నౌకలను అమ్మేసింది.

శీతల పానీయాల కోసం యుద్ధ నౌకలను ఒక దేశం అమ్మిందని చెబితే ఎవరైనా ఘొల్లున నవ్వుతారు. మరికొందరైతే ఆ మాటల్లో నిజం లేదని చెబుతారు. కానీ ఒకప్పటి సోవియట్ యూనియన్(ఉమ్మడి రష్యా) పెప్సీ కూల్ డ్రింక్ కోసం యుద్ధ నౌకలను అమ్మాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొంది. 1959 సంవత్సరంలో సోవియట్ సర్కార్ అమెరికాకు టెక్నాలజీని పరిచయం చేసింది. అందుకోసం న్యూయార్క్ లో భారీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.

ఈ ఎగ్జిబిషన్ తరువాత మాస్కోలో అమెరికా తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో సోవియట్ యూనియన్(ఉమ్మడి రష్యా) ఉపాధ్యక్షుడు క్రుషేవ్, అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ఇద్దరి మధ్య పెట్టుబడిదారీ విధానానికి సంబంధించి వివాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో పెప్సీను రుచి చూసిన క్రుషేవ్ దిగుమతి చేసుకోవాలని భావించి పెప్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సోవియట్ అమెరికాకు పెప్సీ దిగుమతికి బదులుగా వోడ్కాను ఎగుమతి చేసేది.

అయితే 1990లో సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడం వల్ల అమెరికా సోవియట్ ఉత్పత్తులపై నిషేధం విధించింది.. అయితే సోవియట్ మాత్రం పెప్సీ దిగుమతి చేసుకోవాలని భావించి అందుకు తగిన డబ్బు లేకపోవడంతో యుద్ధనౌకలను పెప్సీకి అమ్మేసింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pitapuram: ఒక్క పిఠాపురంలోని 500 కోట్ల బెట్టింగ్.. ఉత్కంఠత రేపుతున్న ఎన్నికల ఫలితాలు!

Published

on

Pitapuram: దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏకంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ నాల్గవ తేదీ వెలవడే ఫలితాల కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై రాజకీయ నాయకులు అటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ దిగగా ఈయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీత గెలిస్తే తనుకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తానని చెప్పారు దీంతో ఈమె గెలుపు పై కూడా ఆసక్తి నెలకొంది.

Advertisement

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత..
ఈ క్రమంలోనే వంగా గీత గెలుస్తారని గెలుస్తారు అంటూ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. అయితే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పై మాత్రమే కాకుండా పార్లమెంట్ అభ్యర్థిపై కూడా సుమారు 500 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

Advertisement
Continue Reading

Featured

Laya: అమెరికాలో అడుక్కు తింటున్నా.. రోల్స్ పై ఎమోషనల్ అయిన లయ?

Published

on

Laya: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లయ ఒకరు. ఈమె హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అయితే ఈమె నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం విశేషం ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా లయ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఇక పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుత తన కూతురితో కలసి సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు అదే విధంగా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ప్రస్తుతం నటుడు నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

రోడ్డుపై పడ్డాను..
తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను అయితే తాను అమెరికాలో ఉన్నాననే విషయం తెలియడంతో చాలామంది నాపై ట్రోల్స్ చేశారు. అమెరికాలో నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని అడుక్కు తింటూ రోడ్డుపై పడ్డానని చాలామంది విమర్శలు చేశారు . అయితే ప్రస్తుతం ఇలాంటి వాటి గురించి పట్టించుకోవడం లేదంటూ లయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పార్టీ గెలిస్తే పవన్ ఎనర్జీ లెవెల్ కు ఆ పదవే కరెక్ట్ అంటున్న ఫ్యాన్స్?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై చాలా ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. అయితే ఈసారి జనసేన పార్టీ సింగిల్ గా కాకుండా తెలుగుదేశం అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ విషయంలో ఓ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి ఏ పదవి ఇస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కు ఆయనకు తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హోం శాఖ మంత్రి అయితే శత్రువుల పాలిట సింహ స్వప్నంలా మారతారని ఆయనకు అదే కరెక్ట్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

హోం శాఖ మంత్రి..
ఇలా పవన్ అభిమానులు చేసే ఈ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ స్పందిస్తూ ముందు పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలవనివ్వండి తర్వాత హోంశాఖ గురించి ఆలోచిస్తారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజక వర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!