సాధారణంగా కొన్నిసార్లు పెరట్లో ఉన్నటువంటి పాములు ఇళ్లల్లోకి ప్రవేశించడం మనం చూస్తుంటాము.అయితే మన ఇంట్లో ఏదైనా కుక్క లేదా పిల్లి వంటి పెంపుడు జంతువులు ఉంటే అవి వాటిని ముందుగా పసిగట్టి ఇంటి యజమానులకు తెలియజేయడం లేదా వాటిని లోపలికి రాకుండా ఆపడమో చేస్తుంటాయి. కొన్నిసార్లు ఈ విషపూరితమైన పాములతో పోరాడుతూ ప్రాణాలను కూడా పోగొట్టుకున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటన ఒడిశా రాజధాని భూవనేశ్వర్ నగరంలోని భీమాటాంగ్రీ గ్రామంలో చోటు చేసుకుంది. సంపద్ కుమార్ పరిదా అనే వ్యక్తి తన ఇంట్లో ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. మంగళవారం సంపద్ కుమార్ పెరట్లో నుంచి ఇంట్లోకి ఒక తాచుపాము వస్తుండడం గమనించిన పిల్లి ఆ పాము ఇంట్లోకి రాకుండా అడ్డుపడింది . ఈ క్రమంలోనే పిల్లిని అనుసరిస్తూ వెళ్లిన సంపద్ నాలుగడుగుల తాచుపామును పిల్లి అడ్డుకోవడం చూశాడు.
ఈ విధంగా తన పెరట్లో తాచుపాము ఉండటంతో వెంటనే సంపద్ స్నేక్ హెల్ప్ లైన్ సెంటర్ కి ఫోన్ చేయడంతో అరుణ్ కుమార్ అనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తాచుపాము పట్టుకొని నగరం బయట వైపు చాలా దూరంలో ఆ పామును వదిలిపెట్టాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు.
పాము ఇంట్లోకి రాకుండా అడ్డుపడిన పిల్లి పై పాము దాడి చేసిందేమోనని చూడటంతో పిల్లి పై ఎలాంటి కాట్లు లేకపోవడం వల్ల యజమాని సంపద్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…