Featured

లీటర్ పెట్రోల్ 40 రూపాయలే.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల వల్ల ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాహనదారులు రోడ్డుపై అడుగుపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు.

ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలపై ఆయన తీవ్ర అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం లీటర్ పెట్రోల్ కేవలం 40 రూపాయలకే ఇవ్వడం సాధ్యమవుతుందని వెల్లడించారు. సాధారణంగా లీటర్ పెట్రోల్ 30 రూపాయలకు ఇవ్వవచ్చని అదనపు ఖర్చులు, ట్యాక్సులతో కలిపి 40 రూపాయలకు ఇవ్వవచ్చని అన్నారు.

తన అభిప్రాయం ప్రకారం గరిష్టంగా 40 రూపాయలకు అమ్మితే సరిపోతుందని అంతకు మించి అమ్మకూడదని అన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చెప్పింది కరెక్ట్ అని ఇతర దేశాల్లా భారత్ లో సైతం పెట్రోల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెరిగితే రూపాయల్లో పెరుగుతున్నాయని.. తగ్గితే మాత్రం పైసల్లో తగ్గుతున్నాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర 90 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 80 రూపాయలుగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని వాహనదారుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

7 minutes ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

15 minutes ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

12 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

15 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

15 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

15 hours ago