Featured

లీటర్ పెట్రోల్ 40 రూపాయలే.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల వల్ల ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాహనదారులు రోడ్డుపై అడుగుపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు.

ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలపై ఆయన తీవ్ర అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం లీటర్ పెట్రోల్ కేవలం 40 రూపాయలకే ఇవ్వడం సాధ్యమవుతుందని వెల్లడించారు. సాధారణంగా లీటర్ పెట్రోల్ 30 రూపాయలకు ఇవ్వవచ్చని అదనపు ఖర్చులు, ట్యాక్సులతో కలిపి 40 రూపాయలకు ఇవ్వవచ్చని అన్నారు.

తన అభిప్రాయం ప్రకారం గరిష్టంగా 40 రూపాయలకు అమ్మితే సరిపోతుందని అంతకు మించి అమ్మకూడదని అన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చెప్పింది కరెక్ట్ అని ఇతర దేశాల్లా భారత్ లో సైతం పెట్రోల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెరిగితే రూపాయల్లో పెరుగుతున్నాయని.. తగ్గితే మాత్రం పైసల్లో తగ్గుతున్నాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర 90 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 80 రూపాయలుగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తే బాగుంటుందని వాహనదారుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago