Ping Pong Surya : తపన సినిమాతో తెలుగులో పరిచయమైన పింగ్ పాంగ్ సూర్య రాజమౌళి ‘సై’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా విజయంతో ఇండస్తీలో మంచి అవకాశాలను అందుకుని హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లను చేస్తూ కేరర్ నిర్మించుకున్న సూర్య సై సినిమా తరువాత పింగ్ పాంగ్ సూర్య గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిరంజీవి గారి సినిమా ‘జై చిరంజీవ’లో చిన్న పాత్ర చేసినా మంచి పేరు వచ్చింది. రాజమౌళి, చంద్ర సిద్ధార్థ, కరుణాకరణ్ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన సూర్య తన సినిమా కష్టాలను, అలాగే డైరెక్టర్స్ దగ్గర తాను నేర్చుకున్న విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
యశో సాగర్ కి ఎలాంటి అలవాట్లు లేవు…
కన్నడ ప్రొడ్యూసర్ కొడుకు యశో సాగర్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తొలిప్రేమ సినిమా డైరెక్టర్ కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’. ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో పింగ్ పాంగ్ సూర్య నటించారు. యశో సాగర్ యాక్సిడెంట్ లో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆయన గురించి సూర్య మాట్లాడుతూ చాలా సైలెంట్ గా, డైరెక్టర్ చెబితే మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా డెడికేటెడ్ గా పనిచేసేవాడు. ఇక అసలు ఎలాంటి చెడు అలవాట్లు లేవు అంటూ చెప్పారు. మందు అలవాటు, కనీసం సిగరెట్ అలవాటు కూడా లేదు అంటూ చెప్పారు.
నేను ఏ హత్య చేయలేదు…
సినిమా ఫైనాన్సింగ్ కోసం రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని కలవడం వల్ల అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం అన్నీ సూర్య జీవితంలో జరిగాయి. సూర్య ఆ కేసు గురించి మాట్లాడుతూ నేనే ఆయనకు కాల్ చేసి ముందు రోజు వెళ్ళాను, చంపాలని హనీ ట్రాప్ చేసి అలా చేసుంటే అలా నేనే కాల్ చేసి ఎందుకు వెళతాను, నేను ఏ తప్పూ చేయలేదు అందుకే భయపడలేదు అంటూ చెప్పారు. ఇక కేసులో ఏ5 గా ఉన్న సూర్యను మీడియాకి చెందిన కొంతమంది 25 లక్షలు ఇస్తే కేసు నుండి తప్పిస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. అయితే నేను ఏ తప్పూ చేయకుండా అలా డబ్బు ఇచ్చి బయటికి రావాల్సిన పని లేదు అంటూ సూర్య చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…