Featured

ఆ స్కీమ్ ద్వారా రూ. 25 లక్షలు రుణం పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

కరోనా మహమ్మారి దేశ ప్రజల ఆలోచనలను, ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల పెద్దపెద్ద వ్యాపారాలు చేసిన వాళ్లు సైతం కోట్ల రూపాయలు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు గతంతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గింది. అయితే కేంద్రం దేశంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒక పథకాన్ని అమలు చేస్తోంది.

ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 25 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసి ప్రయోజనం పొందవచ్చు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందాలని అనుకునే వారు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తూ వ్యాపార రంగంలో కెరీర్ ను ఎంచుకునే వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుని అర్హత సాధిస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చు. చాలా సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అమలవుతున్నా కరోనా విజృంభణ వల్ల ఈ స్కీమ్ గురించి ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ వెబ్ సైట్ ద్వారా కేంద్రం నుంచి రుణం పొందిన వాళ్లకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అయితే ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వాళ్లు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందలేరు. కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేస్తే మంచిది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

14 minutes ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

8 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

9 hours ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

9 hours ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

9 hours ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

9 hours ago