Featured

2008లోనే కరోనా గురించి హెచ్చరించిన శాస్త్రవేత్త.. అసలేం జరిగిందంటే..?

కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. కరోనా ఉధృతి తగ్గిందనుకునే లోపు కొత్తరకం కరోనాకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే 12 సంవత్సరాల క్రితమే ఒక వైరాలజిస్ట్ కరోనా గురించి హెచ్చరించారు.

ప్రపంచ దేశాలు ఆయన హెచ్చరికలను పట్టించుకొని ఉంటే మాత్రం ప్రస్తుతం పరిస్థితి మరో విధంగా ఉండేదని ఇతర శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు చెందిన నాథన్ వోల్ఫ్ అనే వైరాలజిస్ట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అంటువ్యాధులను నియంత్రించడంలో ఫెయిల్ అవుతున్నాయని ఇలా జరగడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

అడవులను నిర్మూలించే క్రమంలో జంతువుల ద్వార కొత్తరకం వైరస్ లు మనుషులకు సోకే అవకాశం ఉందని ఆయన అన్నారు. కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకి మనిషి మరణించి ఉండవచ్చని అయితే ఆ వైరస్ ఇతరులకు వ్యాపించకపోడం వల్ల కొన్నిసార్లు వైరస్ వ్యాప్తి చెందకపోవచ్చని అన్నారు. అంటువ్యాధుల గురించి అప్పట్లో నాథన్ వోల్ఫో చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రపంచ దేశాలు అంటువ్యాధుల గురించి ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రజలు అంటువ్యాధులు ప్రబలిన సమయంలో వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎన్ని కొత్త వైరస్ లు పుట్టుకొచ్చినా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు తగ్గడంతో పాటు ప్రజలు ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago