ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఇటువంటి సమయంలోనే ఎంతోమంది ఎన్నో ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా ఒక రైల్వే ప్లాట్ ఫామ్ పై ఓ వ్యక్తితో కలిసి చిన్నారి నడుచుకుంటూ వెళుతోంది. అకస్మాత్తుగా కాలుజారి రైల్వే పట్టాలపై పడింది. అదే సమయంలో అటుగా రైలు ఎంతో వేగంతో దూసుకొస్తోంది.
ఒక్కసారిగా చిన్నారి రైల్వే పట్టాలపై పడడంతో తనకు తోడుగా వచ్చిన వ్యక్తి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే రైలుకు ఎదురెళ్లి పాప ప్రాణాలను రక్షించేందుకు సాహసం చేశాడు. రైల్వే పట్టాలపై పరుగులు పెడుతూ చిన్నారిని ఫ్లాట్ ఫామ్ మీదకు సురక్షితంగా ఎక్కించి సెకండ్ల వ్యవధిలోనే తను కూడా సురక్షితంగా బయటపడ్డాడు.
మయూర్ షెల్కే మహారాష్ట్రలోని థానే జిల్లా వంగణీ రైల్వే స్టేషన్లో పాయింట్స్ మెన్గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం చిన్నారి ప్లాట్ ఫామ్ పై పడటంతో చిన్నారిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఈ భయంకరమైన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఇతని ధైర్యసాహసాలు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆయన ధైర్యానికి సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ డీఆర్ఎం సహా సిబ్బంది లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ అభినందించారు. అదేవిధంగా ఈ వీడియో పై భారత రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించి మయూర్ షెల్కే కి అభినందనలను తెలియజేసారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…