Tadpatri Constituency: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చారు. అయితే, పోలింగ్ సమయంలో తలెత్తిన ఘర్షణలు ఇప్పటికి పలు ప్రాంతాలలో కొనసాగుతూనే ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఇలా రెండు వర్గాల మధ్య భారీ స్థాయిలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
గతంలో ఇలా ఎప్పుడు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ జరిగేది కానీ ఈసారి ఓటమి భయం కారణంగా రెండు పార్టీ నేతలలో భయం మొదలవడంతో పెద్ద ఎత్తున కుట్రలకు దాడులకు తెర లేపారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా జేసి వర్గీయులు అలాగే పెద్దిరెడ్డి వర్గీయుల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఇలా ఇరువురి పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున కొట్టుకోవడం కారణంగా పలువురు తీవ్ర గాయాలు పాలయ్యారు అయితే ఈ ఉద్రిక్తత కట్టడి చేయడం కోసం పోలీస్ అధికారులు తాడిపత్రి పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు చేశారు. అంతేకాకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి జెసి ప్రభాకర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి పెద్దిరెడ్డి..
ఇలా తాడిపత్రి నగరంలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో పోలీసులు పెద్ద ఎత్తున పహార కాస్తూ ఉన్నారు దీంతో తాడిపత్రి పట్టణంలో పలు విధులన్నీ చాలా నిర్మానుషంగా కనబడుతున్నాయి. ఎన్నికల రోజు జెసి వర్గీయులు పెద్దిరెడ్డి కార్లపై రాళ్లతో దాడి చేయడంతో మొదలైన ఈ గొడవలు ఇప్పటికీ చల్లారలేదని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…