తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో మానవత్వం లేని ఒక దయనీయమైన సంఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కోస్గి పట్టణానికి చెందిన 28 ఏళ్ల మొగులయ్య ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల పోలిసులు ఒక చిరువ్యాపారికి చెందిన తోపుడు బండిని తీసుకుని మృతదేహాన్ని తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించుకోవడానికి వచ్చిన ఆ చిరువ్యాపారికి అనుమతి కూడా తీసుకోకుండా ఈ పని చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి ఉండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు కనీస ఆరోగ్య సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, మృతదేహాన్ని తరలించడానికి కూడా వాహనం సమకూర్చలేకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంబులెన్స్ లేని కారణంగా తోపుడు బండిలో మృతదేహాన్ని తరలించాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…