తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో మానవత్వం లేని ఒక దయనీయమైన సంఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కోస్గి పట్టణానికి చెందిన 28 ఏళ్ల మొగులయ్య ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల పోలిసులు ఒక చిరువ్యాపారికి చెందిన తోపుడు బండిని తీసుకుని మృతదేహాన్ని తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించుకోవడానికి వచ్చిన ఆ చిరువ్యాపారికి అనుమతి కూడా తీసుకోకుండా ఈ పని చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి ఉండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు కనీస ఆరోగ్య సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, మృతదేహాన్ని తరలించడానికి కూడా వాహనం సమకూర్చలేకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంబులెన్స్ లేని కారణంగా తోపుడు బండిలో మృతదేహాన్ని తరలించాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…