Political Analyst Ankamma Rao : ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న ఎన్టీఆర్ గారి కుమార్తె పురందేశ్వరి చొరవతో ఆర్బిఐ 100 రూపాయల నాణెం ను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము గారు నాణెంను విడుదల చేయగా ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అయితే భార్యగా తాను పాల్గొనవలసిన హక్కు తనకు ఉందంటూ లక్ష్మి పార్వతి ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాయగా అసలు నాణెం ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని అది ఒక ప్రైవేట్ కార్యక్రమం అనే విషయాలు బయటికి వస్తున్నాయి. ఇక ఈ ఇష్యూ మీద పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ రావు గారు మాట్లాడారు.
నాణెం మీద రాజకీయాలు ఎందుకు…
అంకమ్మ రావు గారు ఎన్టీఆర్ వందరుపాయల నాణెం గురించి మాట్లాడుతూ ఆయన నాణెం ను కేంద్రం విడుదల చేయడం తెలుగు వారికీ గర్వకారణం ఆ విషయం వదిలేసి లక్ష్మి పార్వతి నన్ను పిలవలేదు నేను ఆయన భార్యని అంటూ మీడియాకెక్కడం బాగోలేదు. ఎన్టీఆర్ గారి కూతురు పురందేశ్వరి, అల్లుడు చంద్రబాబు గురించి విమర్శించడం ఎందుకు కేంద్ర కార్యక్రమం కి వాళ్లకు ఏమిటి సంబంధం అంటూ అంకమ్మ రావు గారు మాట్లాడారు.
నేను ఆయన భార్యని అంటూ ఆమె చెప్పుకోవడమే కానీ ఏపీ లో ఎవరు ఆ విషయాన్ని అంగీకరించరు. నిజంగా ఎన్టీఆర్ భార్య గా ఆయన మీద గౌరవం ఉండి ఉంటే ఆయన హెల్త్ యూనివర్సిటీ రాష్ట్రానికి తీసుకువస్తే నువ్వున్న పార్టీ, పదవులు పొందిన పార్టీ వాళ్ళే పేరు మారుస్తుంటే పోరాడలేదు మళ్ళీ భార్యని అంటూ హక్కుల గురించి మాట్లాడుతున్నావ్ అంటూ అంకమ్మ రావు ఫైర్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…