Featured

Political Analyst Ankamma rao : కుప్పంలో చంద్రబాబు ఓటమి కోసం కొత్త వ్యూహాలు రచిస్తున్న జగన్…: రాజకీయ విశ్లేషకులు అంకమ్మ రావు

Political Analyst Ankamma rao : ఏపీ రాజకీయాల్లో అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ మధ్య రాజకీయ పోరు కాస్త వ్యక్తిగతం అయిపోయింది. విమర్శలు తారా స్థాయికి చేరిపోయాయి. అధికార పార్టీ రాష్ట్ర అభివృద్ధి కంటే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో ఆయనను ఓడించడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. జగన్ పదే పదే టీడీపీ శ్రేణులను నిరాశ పరిచడానికి చంద్రబాబు కుప్పంలోనే ఓడిపోతారు 175 కి 175 ఈసారి వైసీపీ ఖాతలో ఉంటాయంటూ చెబుతుంటారు. తాజాగా చంద్రబాబు కుప్పం మాత్రమే కాకుండా మరో నియోజకవర్గంలో కూడ ఈసారి పోటీ చేస్తారంటు వస్తున్న వార్తలలో నిజమేంత అనే విషయాలను పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ రావు గారు తెలిపారు.

చంద్రబాబును ఓడించడానికి జగన్ కొత్త వ్యూహాలు….

ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తూనే ఉంటాయి. కానీ ఈసారి ఎన్నికలలో ఏపీ సీఎం జగన్ మొత్తం సీట్లు వైసీపీ గెలుస్తుందంటూ “వై నాట్ 175” అనే నినాదం తో వెళ్తున్నారు. ఇది కొంచం ఎక్కువైనా ఇందులోనూ ఒక వ్యూహం ఉంది. అధికార పార్టీ కి ఏమాత్రం వ్యతిరేకత లేదని చూయించుకునే ప్రయత్నం అలానే ప్రతిపక్షాల ఆత్మవిశ్వాసం ను దెబ్బతీసే ప్రయత్నం. అయితే ఈసారి వైసీపీ కుప్పంలో చంద్రబాబు ను ఓడించడానికి చాలా ప్రయత్నింస్తోంది. కానీ అవేవి ఫలించవు అంటూ అనలిస్ట్ అంకమ్మ రావు తెలిపారు.

తాజాగా జరిగిన అమరావతి ఏరియా లోని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో టీడీపీ మద్దతుదారులు గెలవడం మరోవైపు లోకేష్ యువ గళంకు రోజు రోజుకు ఆధరణ పెరుగుతోందని ఆయన వివరించారు. ఇక కుప్పంలో గత ఎన్నికలలో చంద్రబాబు మీద పోటీ చేసిన వ్యక్తే ఇపుడు టీడీపీలో చేరిపోయాడంటే ఇక కుప్పంలో వైసీపీ వచ్చే సీన్ లేదంటూ తెలిపారు. కేవలం వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని వివరించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago