Poonam Kaur: ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన పూనమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన పూనమ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. అయితే హీరోయిన్ గా అవకాశాలు రాకపోవటంతో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించింది.
కొంతకాలంగా అవకాశాలు రాకపోవటంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ అమ్మడు చేసే ట్వీట్లు వల్ల మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే అది నెగటివ్ ఫాలోయింగ్. సోషల్ మీడియాలో తరచు పవన్ కళ్యాణ్ పేరుతో లింకులు పెట్టి ఈమెని వివాదాల్లోకి లాగుతుంటారు. ఈ అమ్మడు కూడా వివాదాస్పద పోస్ట్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఈ అమ్మడు మరొకసారి వివాదాస్పద ట్వీట్ చేసింది. ఒకవైపు సారీ చెబుతూనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా దేవుళ్ళ విషయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. అయితే ఇటీవల పూనమ్ కూడా అలాంటి ప్రశ్న వేసింది. తాజాగా ..’ జీసస్ ఎవరికి పుట్టారు.? ఎలా పుట్టారు.? అంటూ ట్విట్టర్ లో పూనమ్ కౌర్ ప్రశ్ర వేసింది.
‘నన్ను తప్పుగా అనుకోవద్దు.. నిజంగా జీసేస్ ఎవరికి పుట్టాడో నాకు తెలియదు. ఎందుకంటే నేను అంత చదువుకున్నదాన్ని కాదు.. కానీ, ఈ ప్రశ్న కు సమధానం తెలుసుకోవాలనుకుంటున్నా..’ అంటూ ట్వీట్ చేసింది. అయితే పూనమ్ అడిగిన ఈ ప్రశ్న కు క్రిస్టియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జీసస్ ఎవరికి పుట్టారు.? అంటే, అసలు అదేం ప్రశ్న. ఏ దేవుడి విషయంలో అయినా, ఇలా ప్రశ్నించగలమా.? అంటూ కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. అయితే జనాలు తనని మరచిపోకుండా కేవలం అటెన్షన్ కోసమే మాత్రమే పూనమ్ కౌర్ ఇలాంటి వివాదాస్పద ప్రశ్న సంధించి వుండొచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…