Poonam Kaur: ఆ విషయంలో గురూజీ మంచి సమర్థుడే… త్రివిక్రమ్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్?

Poonam Kaur: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుంటుందో అందరికీ తెలిసిందే. ఇలా త్రివిక్రమ్ సినిమాలంటే ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ సినిమా కాదని ఈ సినిమాని త్రివిక్రమ్ యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను ఆధారంగా చేసుకుని రాశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈ సినిమా కాఫీ అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆయన దేనినైనా చేయగల సమర్థుడు అంతేకాకుండా దాని నుంచి ఎలాగా తప్పించుకోవాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి అంటూ కామెంట్ లు చేశారు. తన తప్పుడు పనులు ప్రజలకు కనపడకుండా చేయగల నైపుణ్యం ఉన్నవారు.

కొంతమంది గుడ్డిగా నమ్ముతారు..

కొంతమంది ఆయనని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రజలకు సహాయం చేయడానికి రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం భారీగా సహాయం చేసిందని అది ఎందుకో ఇప్పటికి నాకు అర్థం కాదు అంటూ ఈమె గురూజీ త్రివిక్రమ్ పై చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో ఈమె పరోక్షంగా పవన్ పై కూడా సెటైర్స్ వేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.