Poonam Kaur: వైయస్ షర్మిలపై సెటైర్స్ వేసిన పూనమ్.. తన మౌనం ఆశ్చర్యంగా ఉందంటూ ట్వీట్!

Poonam Kaur: సినీ ఇండస్ట్రీలో సంచలన తారగా ఎంతో ఫేమస్ అయినటువంటి నటి పూనమ్ కౌర్ తరచు వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తలలో నిలుస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈమె రాజకీయాలను కూడా టచ్ చేస్తూ చేస్తున్నటువంటి పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ట్వీట్లు చేసినటువంటి ఈమె వైయస్ జగన్మోహన్ పై ప్రశంసలు కురిపించారు.

ఇకపోతే తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈమె పొలిటికల్ లీడర్స్ ను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెనాలికి చెందిన మహిళ గీతాంజలి ఇటీవల సోషల్ మీడియాలో టిడిపి జనసేన పార్టీ వాళ్లు చేసినటువంటి ట్రోల్స్ కు తీవ్రమైనటువంటి మనస్థాపానికి గురై ఈమె ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియా వేదికగా జనసేన టిడిపి కార్యకర్తలు చేసినటువంటి ట్రోల్స్ కారణంగా ఈమె మరణించారని తెలుస్తుంది. అయితే ఈమె మరణం పట్ల ఇప్పటికే ఎంతోమంది స్పందిస్తూ తనకు న్యాయం జరగాలి అంటూ పోస్టులు చేశారు. ఇక పూనమ్ కవర్ కూడా ఈమెకు న్యాయం జరగాలని నిందితులకు శిక్ష పడాలని కోరుకున్నారు.

గుణ పాఠం చెప్పాలి…
ఇక ఈ విషయం గురించి ఏపీ కాంగ్రెస్ పీసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల మౌనంగా ఉండడంతో పూనమ్ షర్మిలపై సెటైర్స్ వేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధాన లక్షణం స్త్రీలు పిల్లల పట్ల ఎంతో కనికరంగా ఉండటం. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేసిన గీతాంజలి ఘటన గురించి వైయస్ షర్మిల మౌనంగా ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ ఈమె పోస్ట్ చేశారు. తెనాలిలోని మహిళలు, బాలికలు బయటకు వచ్చి వారికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఈమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.