Posani Krishna Murali : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొస్తారు. పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసిన పోసాని గాయం, రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండే పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆయన ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడారు.
పవన్ కుల రాజకీయాలు చేస్తున్నాడు…
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి అందులో నచ్చే ఇద్దరు నాయకుల గురించి పోసాని గారిని అడిగితే పవన్ మీద ఫైర్ అయ్యాడు. ఒకప్పుడు ప్రజారాజ్యంకి దగ్గర ఉండి చిరంజీవి అంటే గౌరవంగా ఉండే పోసాని ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో ఉన్నారు. వైసీపీ నుండి జనసేన మీద తీవ్రంగా విరుచుకుపడే పోసాని పవన్ కుల రాజకీయాలు చేస్తాడు అంటూ తెలిపారు. జనసేన కు ఒక విధానము అంటూ లేదని, అజెండా ప్రకటిస్తే ఏదైనా మాట్లాడొచ్చు, తన పార్టీ ఎందుకు ఉందో ఇంతవరకూ క్లారిటిగా చెప్పలేదని చెప్పారు.
ఇక పవన్ కుల ప్రస్తావన లేకుండా రాజకీయం చేస్తానని చెబుతూనే కాపు కులాన్నీ నేనే ఉద్దరిస్తాను అని మాట్లాడుతున్నాడు. అది తప్పు. ఒకవేళ కాపు కులం కోసం నేను పార్టీ పెట్టాను అనుంటే అది వేరే విషయం కానీ కులప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి మళ్ళీ కాపు కులాలానికి నేనే దిక్కు అన్నట్లు మాట్లాడటం బాగోలేదు అంటూ ఫైర్ అయ్యాడు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…