Posani Krishna Murali : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళీ. నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొచ్చే పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు. అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసే సమయంలోనే వర్మ సినిమాలో అవకాశం వచ్చినా పని పూర్తిగా నేర్చుకున్నాకే చేస్తానని చెప్పి తిరస్కరించిన పోసాని ఆ తరువాత గాయం, నాగార్జున రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. ఇక రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్న పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆయన తన వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
చనిపోతానని తెలిసిపోయింది…
పోసాని గారికి కొద్ది కాలానికి ముందు హెర్నియా సర్జరీ జరిగింది. ఆ సర్జరీ చాలా చిన్నది అలాగే ఎక్కువ మంది చేయించుకుంటున్నదే. అయితే ఆ సర్జరీ సమయంలో ఇన్ఫెక్షన్ సోకడం వల్ల పోసాని గారికి సీరియస్ అయింది. షుగర్ వ్యాధి అప్పటికే ఉండటం వల్ల ఇన్ఫెక్టన్ ఎక్కువగా సోకి ఆయన ప్రాణాపాయ స్టేజికి వెళ్లిపోయారట. ఆ సమయంలో 20 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గిపోయి దాదాపు పీనుగులా అయిపోయాను అంటూ చెప్పారు పోసాని.
ఆయనకు డాక్టర్స్ హైడోస్ మందులు ఇస్తుంటే పోసాని గారు నేను చనిపోతానని నాకనిపిస్తుంది, నాకు ఈ మందులు అవి ఏం ఇవ్వకండి చాలా ఇబ్బంది పడుతున్నాను, నా వల్ల కాదు అని మెడిసిన్ మొత్తం ఆపేసారట డాక్టర్స్. అయితే ఆ సమయంలో పోసాని గారి భార్య తెలిసిన డాక్టర్స్ ప్రసాద్ గారికి కాల్ చేసి ఏడ్చి విషయం మొత్తం చెబితే ఆయన లండన్ లో ఉన్న పోసాని గారి కోసం హాస్పిటల్ కి నేరుగా వచ్చి ఆయనకు చిన్న పరీక్షలు చేస్తాం అని చెప్పి పెట్ టెస్టు చేయించి మరో సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ ను తొలగించారట. అలా నెమ్మదిగా కోలుకున్నాను అంటూ పోసాని గారు తెలిపారు. ఆ సమయంలో జగన్ గారు సజ్జల గారిని మరి కొంతమందిని పంపి ఎలా ఉంది అని అన్ని విషయాలు వాకబు చేసేవారంటూ తెలిపారు పోసాని.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…