Prabhas Heroin: అర్ధరాత్రి అసభ్యకర మెసేజ్ లతో ఎంతో ఇబ్బంది పడిన ప్రభాస్ హీరోయిన్… భరించలేక పోలీసులకు ఫిర్యాదు!
Prabhas Heroin: కాలం మారుతున్న సమాజం రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్న అమ్మాయిల పట్ల జరిగే దాడులు వారికి జరుగుతున్న అవమానాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవి కూడా కాలంతోపాటు పెరుగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎంతోమంది అమ్మాయిలు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కేవలం సాధారణ అమ్మాయిలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు పలువురు అసభ్య ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డామని బహిరంగంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది.ప్రభాస్ హీరోగా బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లెలి పాత్రలో నటించిన సంజనా గల్రాని అందరికీ సుపరిచితమే.
ఈమె బుజ్జిగాడు సినిమా తరువాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ డ్రగ్స్ వ్యవహారంలో ఈమె ఎంతో పాపులర్ అయ్యారు. డ్రగ్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక ఈ విషయంలో బెయిల్ పై బయటకు వచ్చిన సంజన మరొక వివాదంలో నిలిచారు.
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఆడం బిడ్డప్ప సంజనతో ఒకప్పుడు పని చేశారు. ఇలా ఈ సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం వీరి మధ్య మంచి స్నేహ బంధంగా మారింది. అయితే సదరు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఈమెకు అర్ధరాత్రి సమయంలో వినడానికి రాయడానికి కూడా ఎంతో అసభ్యకరంగా ఉండే పదాలతో మెసేజ్ లు చేశారని వాటిని చూసి భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయంపై సదరు ఫోటోగ్రాఫర్ ని విచారించగా తాను ఎలాంటి అభ్యంతరకర మెసేజ్ లు పెట్ట లేదని వాదించాడు దీంతో పోలీసులు అతని ఫోన్ తీసుకొని చెక్ చేయగా ఫోన్ లో ఏ విధమైనటువంటి మెసేజ్ లు కనిపించకపోవడంతో పోలీసులు అతని ఫోను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసులో భాగంగా తప్పు ఎవరిదో తెలియాల్సి ఉంది.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…